హీరోయిన్ గా ఓ పొజిషన్ వచ్చాక ఇక వారు చెప్పేదే ఫైనల్ అనే భావన ఉంటుంది. అటువంటి సందర్భాల్లో వారు చెప్పే కోరికలను తీర్చాల్సిన బాధ్యత ఈ చిత్ర నిర్మాతలకి, దర్శకులకి ఉంటుంది. ఇక తాజాగా కోటి రూపాయల ఖర్చుతో చేస్తున్న ఓ మూవీ సాంగ్ పిక్ఛరైజేషన్ లో  బాయ్ ప్రెండ్ వచ్చాడని ఆ షూటింగ్ కి హీరోయిన్ పేకప్ చెప్పటం అనేది బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.


దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…సంజయ్ దత్ బయోపిక్ లో అనుష్క శర్మ నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ సమయంలో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. ఈ బ్యూటీ కొన్ని సంవత్సరాలుగా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో ప్రేమాయణం లో ఉన్న సంగతి తెలిసింది. అనుష్క శర్మ,విరాట్ కోహ్లీ ఇద్దరూ పలు సందర్భాల్లో ఫారిన్ లొకేషన్స్ కి వెళ్ళి ఎంజాయ్ చేశారనే విషయం కూడ ఎన్నో సార్లు బయటకు వచ్చాయి.


తాజాగా విరాట్ కోహ్లి బాధలో ఉన్నాడని ప్రియుడికి ఓదార్పు ఇచ్చేందుకు షూటింగ్ కి బ్రేక్ చెప్పి మరీ వెళ్లింది. బెంగుళూరు జట్టుకు నేతృత్వం వహిస్తున్న కోహ్లీ భుజానికి సంబందించిన గాయంతో బాధ పడిన విషయం తెలిసిందే. ఇందుకు అనుష్క తట్టుకోలేక వెంటనే కోహ్లీ ఉన్న చోటికి వెళ్ళింది. దీని కారణంగా అనుష్క శర్మ చేస్తున్న మూవీ షూటింగ్ ఆగిపోయింది. ఇదిలా ఉంటే నెల రోజుల క్రితం అనుష్క శర్మ చేస్తున్న సంజయ్ దత్త బయోపిక్ చిత్ర షూటింగ్ కి విరాట్ కోహ్లి వచ్చాడు.


భారీ సెట్స్ తో ఆ చిత్రానికి దాదాపు వంద మందికి పైగా పనిచేస్తున్న ఆ టైంలో…విరాట్ కోసం షూటింగ్ కి పేకప్ చెప్పేసి వెళ్లిపోయింది.  అనుష్క శర్మ చేసిన ఈ పనికి చిత్ర యూనిట్ తల పట్టుకుంది. అయితే అలా బయటకు వెళ్ళిన ఈ బ్యూటీ వెంటనే వచ్చేసిందా? అంటే రాలేదంట. దీంతో ఆ రోజు షూటింగ్ ని ఆపుకున్న చిత్ర యూనిట్…తరవాత రోజున ప్రారంభం చేసుకుంది. అనుష్క శర్మ చేసిన ఆ పనికి చిత్ర నిర్మాతకి జరిగిన నష్టం దాదాపు 70 లక్షల రూపాయలు. దీంతో టాప్ హీరోయిన్స్ ని భరించాలంటే కాస్త గట్టి నిర్మాత ఉండాల్సిందే అని అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: