బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ హీరోయిన్స్ మధ్య ఏదొక ఫైట్ జరుగుతూనే ఉంటుంది. ఆ విధంగా తాజాగా టాప్ హీరోయిన్స్ మధ్య మాటల యుద్ధం జరిగింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…టాప్ హీరోయిన్ అయిన కంగనా రనౌట్ పై ప్రియాంక చోప్ర ఫైర్ అయింది. గత కొంత కాలం నుండి తన వద్దకు వస్తున్న కథలను తనకి రాకుండా చేస్తున్నారని చెప్పుకొచ్చింది.


కొన్ని సందర్భాల్లో తను సైలెంట్ గా ఉండటంతో ఇప్పుడు తను మరింతగా రెచ్చిపోతుందని ప్రియాంక చోప్ర గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. అయితే ఇదంత కెమెరా ముందు జరగలేదు. ప్రియాంక చోప్ర తన మేనేజర్ తో ఈ విషయాన్ని కంగనాకు చెప్పేలా చేసిందని అంటున్నారు. తాజాగా కంగనా రనౌట్ ఝాన్సీ లక్ష్మి భాయ్ బయోపిక్ లో నటిస్తుందనే విషయం తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తీ కావొచ్చిన ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి రానుంది.


మణికర్ణికా పేరుతొ తెరకెక్కే ఈ సినిమాలో కంగనా రనౌట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.  కంగనా ఇప్పటికే పలు రకాల లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో తెరకెక్కించి మంచి సక్సెస్ ని సాధించింది. ఇప్పుడు ఝాన్సీ లక్ష్మి భాయ్ బయోపిక్ లోనూ తను వైవిధ్యమైన ప్రతిభని చూపిస్తుందని అంటున్నారు. ఇందుకోసం కంగనా రనౌట్ గుర్రపు స్వారీ,కత్తి యుద్దాలు, ఫిజికల్ ట్రైనింగ్ వంటి అన్నివిధాలా ట్రైనింగ్ లను తీసుకుంటుందట. అలాగే ఝాన్సీ లక్ష్మి భాయ్ లుక్ కోసం ఓ డిజైన్ ప్లాన్ చేసారు.


ఆ పోస్టర్ లో ఝాన్సీ లక్ష్మి భాయ్ గా కంగనా రనౌట్ సూపర్భ్ గా ఆకట్టుకుంది అంటున్నారు. అయితే నిజానికి ఈ సినిమా తనకు రావాలని ప్రియాంక చోప్ర అంటుంది. తన వద్దకు మొదటగా ఈ ప్రాజెక్ట్ ని కంగనా రనౌట్ తెలివిగా తప్పించిందని చెప్పుకొచ్చింది. నిర్మాతలను, డైరెక్టర్స్ ని ఇట్టే ఆకట్టుకోగల టెక్నిక్స్ తన దగ్గర ఎన్నో ఉన్నాయని…అందుకే కొన్ని మంచి మూవీలు తన వద్ద నుండి చేజారుతున్నాయని చెప్పుకొచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: