నేడు బాహుబ‌లి మూవీ అంత‌టా రిలీజ్ అయింది. ఇదిలా ఉంటే బాహుబలి2 మూవీ పైరసీ జరిగిందనే వార్త ఇండస్ట్రీలో కలకలం రేకెత్తిస్తుంది. ముఖ్యంగా నిర్మాతలకి ఇది నిద్రలేకుండా చేస్తుంది. బాహుబలి2 మూవీ విషయానికి వస్తే ఈ మూవీ ప్రపంచం అంతటా హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్స్ తో ప్ర‌ద‌ర్శ‌న జ‌రుపుకుంటుంది.కానీ రెండు రోజుల క్రితమే బాహుబలి2 మూవీకి సంబంధించిన కొన్ని క్లిప్స్ బయటకు వచ్చాయి.


అందులో బాహుబలి2 మూవీకి సంబంధించిన కీలక సన్నివేశాలు ఉన్నాయనేది సోషియల్ మీడియాలో వినిపిస్తున్న టాక్స్. కొంత మంది అయితే బాహుబలి2 మూవీ సూపర్భ్ గా ఉందంటూ…ప్రీమియర్ షోల కంటే ముందుగానే కామెంట్స్ చేస్తున్నారు. సినిమాని చూసిన తరువాత ఏ విధంగా కచ్ఛితమైన రిపోర్ట్ ని చెబుతారో…ఆ విధంగానే పలువురు బాహుబలి2పై కామెంట్ చేయటంతో అసలు బాహుబలి2 మూవీ ఫుటేజ్ భద్రంగానే ఉందా? అనే అనుమానాలు అంతటా వస్తున్నాయి.


కొంత మంది అయితే బాహుబలి2 మూవీ కచ్ఛితంగా పైరసీ జరిగిందనీ…అందులోనూ చాలా క్వాలిటీ వీడియో బయట సర్క్యులేట్ అవుతుందని అంటున్నారు. దీంతో ముందుగానే మేల్కొన్న చిత్ర నిర్మాతలు బాహుబలి2 పైరసీనీ కట్టడి చేసేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


నిర్మాతలు ఈ మూవీ పైరసీ జరగలేదని చెబుతున్నప్పటికీ…బయట నుండి వస్తున్న వార్తలను చూస్తే… బాహుబలి2 పైరసీ జరిగిందని నమ్మాల్సిన పరిస్థితి అంటున్నారు. అందుకే ముందుగానే జాగ్రత్తగా అన్ని విధాలుగా రెడీ అయ్యారు. మొత్తంగా బాహుబలి2 రిలీజ్ రోజున సాయంత్రమే ఈ మూవీ పైరసీ…మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: