ఏ డైరెక్టర్ విజన్ లో ఏ సక్సెస్ ఉందో? వంటిది ఊహించటం చాలా కష్టం. డైరెక్టర్ చెప్పిన కథకి ఒక్కసారి హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటే ఇక ఆ మూవీలో నటించే ఇతర ఆర్టిస్ట్ లు అంతా డైరెక్టర్ ని ఫాలో అవ్వాల్సిందే. అలా కాకుండా ఎవరికి వారు కథలో వారి ప్రాముఖ్యత ఏంటి? అంటూ డైరెక్టర్ ని ప్రశ్నిస్తే…చివరి జరగాల్సింది జరుగుతుంది అని డైరెక్టర్స్ అంటారు.


ఆ విధంగా స్టార్ హీరోయిన్ తమన్న ‘బాహుబలి’ విషయంలో డైరెక్టర్ తో కాస్త వాదనలు పెంచుకోవటంతో ఈ బ్యూటీకి ‘బాహుబలి-2’ లో ప్రాధాన్యత లేకుండా పోయింది. దీని కారణంగా ‘బాహుబలి’ మొదటి భాగంలో ఎక్కువ ప్రాధాన్యత తమన్న పాత్ర…రెండో భాగంలో కొన్ని నిముషాలకే పరిమితం కావాల్సి వచ్చింది. మొత్తంగా‘బాహుబలి-2’ షూటింగ్ సమయంలో తమన్న, రాజమౌళి మధ్య జరిగిన గొడవ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాక్స్ గా వినిపిస్తుంది.


దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…బాహుబలి మొదటి భాగంలో తమన్న పాత్ర కీలకంగా ఉంది. ఇప్పుడు ‘బాహుబలి-2’ లో తమన్న పాత్ర ప్రేక్షక పాత్రకి పరిమితం అయింది. అయితే రెండో భాగంలోనూ తమన్నకి మంచి రోల్ ఇవ్వాలని రాజమౌళి చూశాడంట. కానీ తమన్న మాత్రం తన పాత్ర నిడివిని ఇంకాస్త పెంచాలని డిమాండ్ చేసిందట. దీంతో కథలో తమన్న పాత్రని తగ్గించేసి…అనుష్క మీదే పూర్తి చేశాడు. దీని కారణంగా ‘బాహుబలి-2’ లో తమన్న కొద్ది నిముషాలు మాత్రమే కనిపించింది.


అలాగే ‘బాహుబలి-2’ క్రెడిట్ లో తమన్నకి ఇసుకంత కూడ పేరు రాలేదు. మొత్తం అనుష్కకే వెళ్లింది. కేవలం రాజమౌళితో తన పాత్ర గురించి ఎక్కువుగా మాట్లాడటంతో ఈ దర్శకధీరుడు తమన్నని ఏకంగా పక్కనపెట్టేయటం జరిగిందని అంటున్నారు. మొత్తంగా ‘బాహుబలి-2’ లో తమన్న కి సరైన పాత్రలేకపోవటం అనేది ఇప్పుడు ‘బాహుబలి-2’ సక్సెస్ న చూసిన తరువాత ఎంతో ఫీల్ అవుతుందని అంటున్నారు. అంతే కాకుండా ఇది తనకి జరిగిన భారీ నష్టం అని కూడ అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: