మెగాస్టార్ కుటుంబ సభ్యుల నడుమ సినిమాల విడుదలపై పీటముడి బిగుసుకుంటోందా? పవన్ 'అత్తారింటికి దారేది'. చరణ్ 'ఎవడు' సినిమాల విడుదల తేదీలు ఖరారులో పంతాలు చోటు చేసుకుంటున్నాయా? విషయాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. అసలు యముడు సినిమాతో వచ్చింది అ సలు తలకాయ నొప్పి. మామూలుగా అయితే 'ఎవడు' ఈ నెల 25న విడుదల కావాల్సి వుంది. కానీ యముడు హిట్ కావడంతో, దిల్ రాజు 30కి వాయిదా వేయాలని ఆలోచించారు. కానీ చరణ్ ఏకంగా 7కు వాయిదా వేసుకుంటే బెటరని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే 'అత్తారింటికి దారేది' సినిమాకు పవన్ 7వతేదీని ఖరారు చేసుకున్నట్లు తెలిసింది. ఆ లోగా ఎలాగైనా అన్ని పనులు పూర్తి చేయాలని, యూనిట్ కిందామీదా పడుతోంది. దీంతో దిల్ రాజు 30న తమ సినిమా విడుదల చేసేయాలని పట్టుదలతో వున్నట్లు తెలిసింది. ఈ సంగతి తెలిసి పవన్ మరీ పట్టుదలగా తన సినిమా ఫినిష్ చేయిస్తున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. మొత్తానికి ఈ రెండు సినిమాలు మెగా కుటుంబ వ్యవహారాలకు అద్దం పడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: