దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం బాహుబలి2. ప్రస్తుతం ఈ మూవీకి అన్ని చోట్ల నుండి భారీ రెస్పాన్స్ వస్తుంది. అంతే కాకుండా బాహుబలి2 1000 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని సైతం కొల్లగొడుతుంది. దీంతో మే రెండో వారంలో బాహుబలి2 సక్సెస్ కి సంబంధించిన ఫంక్షన్ ని బాలీవుడ్ లో ప్లాన్ చేశారు చిత్ర యూనిట్. దీనికి కరణ్ జోహార్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.


బాహుబలి2 సక్సెస్ ఫంక్షన్ ని బాలీవుడ్ కి చెందిన పెద్ద పెద్ద స్టార్స్ రానున్నారు. అయితే ఇంతలో ఏమైందో తెలియదుకానీ ఈ ఫంక్షన్ నిర్వహణపై పలు అనుమానాలు వస్తున్నాయి. ఎవరు ఈ కార్యక్రమాన్ని దగ్గర ఉండి జరిపించాలి? అనే ప్రశ్నలు వస్తున్నాయి. కచ్ఛితంగా బాహుబలి2 హిందీ రైట్స్ తీసుకున్నది కరణ్ జోహార్ కాబట్టి...అతనొక్కడే ఈ ఫంక్షన్ కి అన్నీ తానై చూసుకోవాలి.


అయితే ఫంక్షన్ జరిగితే…ఫంక్షన్ లో బాహుబలి2 గురించి బాలీవుడ్ హీరోలు ఏం మాట్లాడాలి? ఇది సౌత్ ఇండియన్ మూవీ అని మాట్లాడాలా? లేక బాలీవుడ్ ఫిల్మ్? అని మాట్లాడాలా? వంటి అనుమానాలు హీరోలకి వస్తున్నాయి. కచ్ఛితంగా బాహుబలి2 చిత్ర యూనిట్ మాత్రం ఈ సక్సెస్ ఓ తెలుగు మూవీ సాధించిన సక్సెస్, సౌత్ ఇండియన్ మూవీ సక్సెస్ అని చెప్పుకుంటుంది.


దీంతో బాహుబలి2 సక్సెస్ ఫంక్షన్ లో సౌత్ ఇండస్ట్రీ వర్సెస్ బాలీవుడ్ ఇండస్ట్రీ వంటి ప్రాంతీయ బేధాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీని కారణంగా బాహుబలి2 మూవీ సక్సెస్ ఫంక్షన్ ని బాలీవుడ్ లో నిర్వహిస్తే…ఆ ఫంక్షన్ కి వచ్చేది లేదు అని కరణ్ జోహార్ కి ఇప్పటికే పలువురు టాప్ హీరోలు చెప్పుకొచ్చినట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: