గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ తరువాత బాలకృష్ణ చేస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. బాలకృష్ణ తన 101వ సినిమాని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ అనేది ఎవ్వరూ ఊహించని విధంగా జరిగింది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.


సినిమా ప్రారంభం నుండి ఈ మూవీకి సంబంధించిన ప్రతి అప్ డేప్ పై ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం..పూరీ జగన్నాధ్ తన స్పీడుతో బాలయ్యకి చుక్కలు చూపిస్తున్నాడని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకూ బాలయ్యకి ఎటువంటి రెస్ట్ లేకుండా షూటింగ్ షెడ్యూల్స్ ని ప్లాన్ చేస్తున్నారు.


బాలయ్య కొన్ని సందర్భాల్లో కాస్త రెస్ట్ తీసుకోవాలని చూస్తున్నప్పటికీ...పూరీ మాత్రం అస్సలు ఒప్పుకోవటం లేదనే టాక్స్ అంతటా వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 29న ఈ చిత్రాన్ని విడుదల చేయడం కోసం చిత్ర యూనిట్ ఓవర్ నైట్ పని చేస్తుంది. మార్చి మూడవ వారంలో మొదలైన ఈ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకుంది. దీంతో దాదాపు 40 శాతం షూటింగ్ పూర్తయిందని అంటున్నారు. ఇక మూడవ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ 11వ తేదీన పోర్చుగల్ వెళ్లనుంది.


పోర్చుగల్ లో భారీ యాక్షన్ సన్నివేశాల్ని, మూడు పాటలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ దాదాపు 40 రోజుల పాటు జరగనుంది. ఈ షెడ్యూల్ పూర్తయితే దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తయినట్టే అని అంటున్నారు. ఆ తరువాత జూన్ లో జరిగే షూటింగ్ తో ఈ మూవీ పూర్తి షూటింగ్ ని పూర్తి చేసుకోనుందని అంటున్నారు. మొత్తంగా పూరీ జగన్నాధ్ తన మెరుపువేగంతో బాలయ్యకి చెమటలు పుట్టిస్తున్నాడని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: