మోసం చేసేవాళ్ళు మోసం చేయాలని నిర్ణయించుకుంటే వాళ్ళకి ఎదుటి వారితో అస్సలు సంబంధం ఉండదు. వాళ్లు చేయాల్సిన మోసం  చేసేస్తారు అంతే. ఆ విధంగానే ఇప్పుడు బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఓ హీరోయిన్ విషయంలో మోసం జరిగిందని అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే… కత్రినా కైఫ్-రణ్ భీర్ కపూర్ జంట గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.


వీరిద్దరూ పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందని ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు సైతం ఫిక్స్ అయ్యారు. అయితే వ్యవహారం ఎక్కడ బెడిసి కొట్టిందో తెలియదు కానీ కత్రినా కైఫ్ దాదాపు రెండు సంవత్సరాల నుండి రణ్ బీర్ కపూర్ కు దూరంగా ఉంటుంది. ఒకప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమాలు వస్తే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకునే వాళ్ళు…ఇప్పుడు ఒకరి మూవీలో ఒకరు నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపించటం లేదు.


అంతే కాకుండా మేకర్స్ కి సైతం ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు. అయితే రణ్ బీర్ కపూర్ తో తన పెళ్ళి లేదని ఫిక్స్ అయిన కత్రినా కైఫ్…ఇంత కాలం జరిగింది ఓ మోసం అని ఫిక్స్ అయిందట. దీంతో రణ్ భీర్ కపూర్ ఆలోచనల నుండి బయటకు వచ్చి…తనకు నచ్ఛిన విధంగా ఉండాలని నిర్ణయించుకుంది.


అందుకే గతంలో తన ప్రేమ కోసం పడిగాపులు కాచే మాజీ ప్రియుడు అక్కున చేరింది. ఇప్పుడు కత్రినా కైఫ్,సల్మాన్ ఖాన్ లు కలసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారని అంటున్నారు. చాలా కాలం తరువాత ‘టైగర్ జిందా హై’ చిత్రంలో వీరిద్దరూ నటిస్తున్నారు. అలాగే ఈ మధ్య కాలంలో కత్రినా కైఫ్, సల్మాన్ లు కలసి ఫారిన్ ట్రిప్స్ కి వెళుతున్నారనే టాక్స్ బిటౌన్ లో జోరుగా వినిపిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: