టాలీవుడ్ లో ప్రస్తుతం క్రేజీ బ్యూటీగా అవతరించింది పూజా హెగ్దె. ముకుందతో ఎంట్రీ ఇచ్చి ఒక లైలా కోసంలో నటించి మెప్పించిన చిన్నది ఆ తర్వాత బాలీవుడ్ లో మొహెంజోదారో సినిమా చేసింది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాధం సినిమాలో నటిస్తున్న అమ్మడికి టాలీవుడ్ లో లక్కీ ఛాన్సులు వస్తున్నాయి.


తెలుగులో ఏ హీరోయిన్ వచ్చినా కాస్త కూస్తో స్టార్ ఇమేజ్ సంపాదిస్తే చాలు వారిపై ఓ కన్నేసి ఉంటాడు బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్. చేసిన రెండు సినిమాల్లోనే సమంత, తమన్నాలాంటి స్టార్ హీరోయిన్స్ తో జోడి కట్టిన శ్రీనివాస్ ప్రస్తుతం నటిస్తున్న బోయపాటి శ్రీనివాస్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ తో రొమాన్స్ చేస్తున్నాడు.


ఈ సినిమా తర్వాత శ్రీవాస్ డైరక్షన్ లో సినిమా కన్ఫాం చేసిన శ్రీనివాస్ అందులో హీరోయిన్ గా డిజె భామ పూజా హెగ్దెను తీసుకోవాలని చూస్తున్నారట. క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలని ఛాన్స్ రాగానే అమ్మడు కోటి రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట. బన్ని పక్కన నటిస్తుంది కాబట్టి ఆమాత్రం ఇవ్వడానికి కూడా ఓకే అన్నారట నిర్మాతలు.


సో చూస్తుంటే పూజా కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగడం ఖాయమనిపిస్తుంది. అందంతో అందరిని ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు అభినయంతో కూడా అలరిస్తే ఇక తెలుగులో అవకాశాలు వచ్చేసినట్టే. డిజే రిజల్ట్ తో టాలీవుడ్ లో అమ్మడి ఫేట్ ఎలా ఉందో తేలిపోతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: