హ్యాపీడేస్ లాంటి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన దర్శకుడు శేఖర్ కమ్ముల. అనామిక ఫ్లాప్ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో శేఖర్ కమ్ముల చేస్తున్న సినిమా ఫిదా. సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్, సాయి పల్లవి లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. కొద్దిగంటల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.


మళయాల ప్రేమంలో మలారేగా సౌత్ సిని ప్రియులను అలరించిన సాయి పల్లవి మొదటిసారి తెలుగులో చేస్తున్న సినిమా ఫిదా. వరుణ్ తేజ్, సాయి పల్లవిల జంటగా చూడముచ్చటగా ఉంది. తెలంగాణా యాసలో సాయి పల్లవి బద్మాష్ అని చెప్పే డైలాగ్ క్యూట్ గా నిపిస్తుంది. తన డబ్బింగ్ తానే చెప్పుకునే సాయి పల్లవి సినిమాలో తన మార్క్ చూపిస్తుందని తెలుస్తుంది. 


ఇక మిస్టర్ లాంటి ఫ్లాప్ సినిమా తర్వాత వస్తున్న ఫిదా మీదే వరుణ్ తేజ్ అన్ని ఆశలు పెట్టుకున్నాడు. సినిమాతో ఎలాగైనా సరే హిట్ కొట్టాలని చూస్తున్నాడు వరుణ్ తేజ్. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న సినిమా కాబట్టి కచ్చితంగా కంటెంట్ ఉన్న సినిమా అనే అనుకోవచ్చు. టీజర్ తో ఇంప్రెస్ చేసిన ఫిదా టీం సినిమాతో ఎలాంటి ఫలితం అందుకుంటారో చూడాలి. దిల్ రాజు బ్యానర్లో హరిష్ శంకర్ అల్లు అర్జున డిజ మూవీ రిలీజ్ జూన్ 23న రాబోతుంది. ఫిదా ట్రైలర్ ను కూడా ఆ సినిమాతో పాటుగా రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: