పాతిక కోట్ల ఖ‌ర్చు, ర‌జ‌నీకాంత్ ప్రసంశ‌లు, త్రీడీ హంగామా, ట్రైల‌ర్‌లో హెవీ డైలాగుల‌తో ఓం హోరెత్తిపోయింది. రెండేళ్ల పాటు షూటింగ్ జ‌రుపుకొని భారీ హంగుల‌తో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. నాన్ నంద‌మూరి ఫ్యాన్స్ కూడా ఈ సినిమా హిట్ కొట్టడం ఖాయం... అనుకొన్నారు. కానీ.. చివ‌రిని ఊరించి, ఊరించి ఉస్సూరుమ‌నిపించింది.

ఈ సినిమా ఓపెనింగ్స్ బాగానే ఉన్నా - టాక్ మాత్రం అంత పాజిటివ్‌గా లేదు. క‌ల్యాన్ రామ్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఫ‌లితంపై సంతృప్తిగా లేరు. బిల్డప్ ఎక్కువ బిజినెస్ త‌క్కువ‌... అని బాహాటంగానే చెప్పేస్తున్నారు. సునీల్ రెడ్డిని న‌మ్మి పాతిక కోట్లు ఎలా ఖ‌ర్చుపెట్టాడ‌నేదే మిలియ‌న్ డాల‌ర్ల ప్రశ్న.


అస‌లు సునీల్‌ని డైరెక్షన్ చేయించ‌లేద‌ని, అంతా క‌ల్యాణ్ రామే చూసుకొన్నాడ‌ని అంటున్నారు. ఏదైతేనేం... మ‌రో భారీ సినిమా నీరుగారిపోయింది. రూ.25 కోట్లు బూడిద‌లో పోసిన ప‌న్నీరే అయ్యింది. క‌ల్యాణ్ రామ్ ఇప్పటికైనా హంగుల కోసం కాకుండా... క‌థ‌పై దృష్టి పెడితే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: