రాజోలు పిల్ల అంజలి తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఒక్కసారిగా లైం లైట్ లోకి వచ్చింది. ఆ సినిమాలో మహేష్, వెంకటేష్ లాంటి ఇద్దరు స్టార్స్ ఉండగా అందులో నటించిన అంజలికి బాగా పేరొచ్చిందంటే అమ్మడి టాలెంట్ ఏంటో గురించవచ్చు. ఈ క్రమంలో ఆమె తెలుగులో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంటుందని అనుకున్నారు కాని అలా కుదరలేదు. అవకాశాలైతే వచ్చినా సరే అమ్మడు మాత్రం సరైన హిట్ కొట్టలేదు. తెలుగులో హిట్లు పలుకరించలేదని తమిళ పరిశ్రమకు షిఫ్ట్ అయ్యింది అంజలి. 


అక్కడ ఓ మోస్తారు హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న అమ్మడు ఇక అక్కడ హీరో జై తో క్లోజ్ గా మూవ్ అయ్యింది. జర్నీ సినిమాలో కలిసి నటించినప్పటి నుండి వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అని అన్నారు. ఇద్దరు కలిసి బర్త్ డే లు జరుపుకున్నారు. తను నాకు చాలా స్పెషల్ అంటూ చెప్పుకున్నారు. అంతేకాదు ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో సహజీవనం కూడా చేశారు. ఇన్ని జరుగుతుంటే ఇక ఇద్దరు పెళ్లి చేసుకోవడమే తరువాయి అనుకున్నారు.


ప్రస్తుతం ఇద్దరు కలిసి బెలూన్ సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జైతో రిలేషన్ షిప్ గురించి అంజలిని అడిగితే అతని జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని మాట మార్చేసింది అంజలి. ఇన్నాళ్లు ప్రేమికులుగా తిరిగి అంతా అయ్యాక ఇప్పుడు మేమిద్దరం స్నేహితులమే అని చెప్పడం షాకింగ్ గానే ఉంది. మరి ఇద్దరు పెళ్లి చేసుకోడానికి ఎందుకు వెనుకాడుతున్నారన్నది అర్ధం కాని విషయం. మొత్తానికి అంజలి మాత్రం మళ్లీ ఒంటరి అయ్యిందని కోలీవుడ్ టాక్.  



మరింత సమాచారం తెలుసుకోండి: