ప్రేమం సినిమాతో సూపర్ హిట్ అందుకుని మలార్ పాత్రకే వన్నె తెచ్చిన సాయి పల్లవి తెలుగులో మొదటి ప్రయత్నంగా చేసిన ఫిదా సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. ఆ సినిమాతో మరింత పాపులారిటీ సంపాదించిన అమ్మడు ప్రస్తుతం నానితో చేసిన ఎం.సి.ఏ సినిమా రిలీజ్ కు సిద్ధమైంది. ఇక ఇదే కాకుండా లేటెస్ట్ గా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సరసన కూడా ఓ సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసిందట సాయి పల్లవి.


సెల్వ రాఘవన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ఒక హీరోయిన్ గా ఇప్పటికే సెలెక్ట్ అవగా సాయి పల్లవిని సెకండ్ హీరోయిన్ గా ఫైనల్ చేశారట. ఫిదా భామకు కోలీవుడ్ లో ఇది గ్రాండ్ ఎంట్రీ అని చెప్పొచ్చు. అయితే ఇప్పటికే కణం సినిమాతో నాగ శౌర్యతో పాటుగా తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమా రాబోతుంది. 


దీనితో పాటుగా సూర్య సినిమాలో కూడా నటించడంతో సాయి పల్లవి క్రేజ్ కోలీవుడ్ లో కూడా పెరుగనుందని చెప్పొచ్చు. ఇక ఇదే కాకుండా తెలుగులో మరో రెండు సినిమాలకు సైన్ చేసిందని అంటున్నారు. అందులో ఒకటి హరీష్ శంకర్ చేస్తున్న మల్టీస్టారర్ సినిమా కాదా మరోటి స్టార్ హీరో సినిమా అంటున్నారు.


టాలీవుడ్ లో టాలెంట్ ఉంటే ఇక ఆ హీరోయిన్ రేంజ్ మాములుగా ఉండదు. ఇప్పటికే రెండు సినిమాల్లో నటించిన కీర్తి సురేష్ టాలెంట్ గుర్తించి ఆమెను స్టార్ హీరోయిన్ చేసేశారు. ఇప్పుడు సాయి పల్లవి కూడా అంతే హంగామా చేస్తుంది. రిలీజ్ అవుతున్న ఎం.సి.ఏ కూడా హిట్ అయితే ఇక సాయి పల్లవి రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: