మాములు గా పవన్ తన సినిమా లకూ సంభందించి ఎటువంటి ఇంటర్వ్యూ లు, ప్రచారం చేసుకోడు. నిర్మాతలు ఎంత ట్రై చేసిన ఒప్పుకోడు. తన ట్విట్టర్ లో కూడా సినిమా గురించి ఎటువంటి న్యూస్ పోస్ట్ చేయడు .అంతెందుకు తన ఆడియో ఫంక్షన్ లో కూడా సినిమా గురించి ఏం మాట్లాడకుండా వెళ్లి పోతాడు. అత్తారింటికి దారేది సినిమా విషయంలో పవన్ ను ఇంటర్వ్యూకు ఒప్పించిన ఘనత త్రివిక్రమ్ కే దక్కుతుంది.
ఇప్పుడు అజ్ఞాతవాసికి కూడా పవన్ తో స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశాడు త్రివిక్రమ్. కిందామీద పడి అతడ్ని ఒప్పించాడు. అంతా బాగుందనుకునే టైమ్ కు కత్తి మహేష్, పూనమ్ కౌర్ ఎపిసోడ్ మొదలైంది. దీంతోఇంటర్వ్యూ మూలనపడింది. నిజానికి పవన్ మీడియా ముందుకు రానక్కర్లేదు. వాళ్లే ఒక యాంకర్ ను పెట్టి, వాళ్లకు ఇష్టమైన ప్రశ్నలే అడిగి, ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఒక ఇంటర్వ్యూ షూట్ చేస్తారు.
ఒకటికి రెండుసార్లు చెక్ చేసిన తర్వాత ఆ ఇంటర్వ్యూను మీడియాకు అందిస్తారు. కానీ కత్తి పుణ్యాన ఈసారి అది కూడా లేకుండా పోయింది. అజ్ఞాతవాసి టీం మాత్రం పోస్ట్-రిలీజ్ ప్రమోషన్ ప్లాన్ చేసింది. సినిమా విడుదలైన తర్వాత కాంబినేషన్ ఇంటర్వ్యూలు చేయబోతోంది. అను ఎమ్మాన్యుయేల్-కీర్తి సురేష్, త్రివిక్రమ్-అనిరుధ్.. లాంటి కాంబినేషన్లతో ఇంటర్వ్యూలు ప్లాన్ చేసింది. మరి అప్పటికైనా పవన్ అందుబాటులోకి వస్తాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అందుకే కత్తి పోటు పవన్ కళ్యాణ్ కు బాగా గుచ్చికుందని చర్చించుకుంటున్నారు.