టాలీవుడ్ ఇండస్ట్రీలో గత సంవత్సరం నుంచి మంచి జోష్ పై ఉన్నారు నందమూరి బాలకృష్ణ.  పోయిన సంక్రాంతికి క్రిష్ దర్శకత్వంలో ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ లాంటి చారిత్రాత్మక చిత్రంతో తన వందవ సినిమా పూర్తి చేశారు.  ఆ తర్వాత పూరిజగన్నాధ్ దర్శకత్వంలో ‘పైసా వసూల్’ సినిమాతో మాస్ స్టైల్లో ఆడియన్స్ ని మెప్పించారు.  తాజాగా కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో..నయనతార, నటాషాదోషి, హరి ప్రియ కథానాయికలుగా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో సోషల్ మీడియాలో తెగ సందడి చేసిన ‘జై సింహ’  బాలయ్య ఇమేజ్ కి తగ్గట్లు ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.  ఈ చిత్రం విడుదల సందర్భంగా బాలయ్య అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియోటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. కూకట్‌పల్లి భ్రమరాంబ ధియేటర్ లో జైసింహా సినిమాను చూసేందుకు బాలయ్య రావడంతో అభిమానులు హంగామా చేశారు.
Image result for jai simha posters
టపాసులు కాల్చుతూ...పెద్దపెట్టున నినాదాలు చేస్తూ..ఫేక్ హ్యండ్ ఇవ్వడానికి ఎగబడ్డారు. అభిమానుల అత్యుత్సాహం చూసి బాలయ్యకు కోపం వచ్చింది. దారికి అడ్డంగా చేతులు పెట్టిన ఓ అభిమాని చేతిపై బాలయ్య కాస్త కోపంగా కొట్టారు, చేతులు అడ్డంపెట్టవద్దని అందరికీ హితవు పలికారు.

కూకట్‌పల్లిలోని భ్రమరాంబ ధియేటర్‌లో తన చిత్రాన్ని బాలయ్య తిలకించారు. నిర్మాత సి.కల్యాణ్, దర్శకుడు రవికుమార్ తదితరులతో కలిసి ఆయన ఈ చిత్రాన్ని తిలకించారు. తన చిత్రానికి ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి బాలయ్య ఆనందం వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: