పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా అజ్ఞాత వాసి సినిమా ఫ్లాప్ అవ్వడం తో పవన్ కళ్యాణ్ అభిమానులు నిరుత్సాహ పడకుండా ఇంకొక సినిమా తీయాలని పవన్ అనుకుంటున్నాడని వినికిడి. రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో వెళ్లేముందుగా తన అభిమానులకు ఓ బ్లాక్ బస్టర్ మూవీని ఇవ్వాలని అనుకున్నాడు పవన్.అందుకే అతను బాగా నమ్మిన దర్శకుడు,మిత్రుడు అయిన త్రివిక్రమ్ ని ఎంచుకున్నాడు.ఇక వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటివరకు వచ్చిన రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.అందుకే అజ్ఞాతవాసితో మరో హిట్ కొట్టి రాజకీయాలను ఓ పని పట్టాలని భావించాడు.
కానీ అన్నిసార్లు మనం అనుకున్నదే జరగదు కదా..ఇక్కడ కూడా అదే జరిగింది. అయితే అభిమానులు తనమీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండాలంటే. వాళ్లలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న నిరాశను, ముఖ్యంగా వారి బాధను తగ్గించేందుకు పవన్ ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడట.అజ్ఞాతవాసి చివరి సినిమా అనుకున్న పవన్ మరో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడట.
ఈసారి రాజకీయపరమైన కథను ఎంచుకుని జనసేన పార్టీకి ఉపయోగపడేలా,అభిమానుల కళ్లలో సంతోషం నింపేలా, మరో సినిమా చేసిన తర్వాతే పార్టీ గురించి ఆలోచిస్తానని తన మిత్రుల దగ్గర చర్చించాడట పవన్. దీంతో పవన్ ఫ్యాన్స్ సైతం మురిసిపోతున్నారు.ఒకవేళ అజ్ఞాతవాసి హిట్ అయ్యుంటే పవన్ను మళ్లీ తెరపై చూసేందుకు చాలా టైం పట్టేదని,ఇప్పుడు మరో సినిమా తీస్తానని చెప్పడంతో మరోసారి తెరపై చూడొచ్చని,అందులోనూ రాజకీయ పరమైన కథ ఎంచుకుంటే ఇక జనసేన పార్టీకి సైతం తిరుగుండదని వాళ్లు తమ సంతోషాన్ని వ్యక్త పరుస్తున్నారు.