ఈ మద్య సోషల్ మీడియా సాక్షిగా  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మహేష్ కత్తి మధ్య రగులుతున్న వివాదం గురించి అందరికీ తెలిసిందే. వీరి మధ్య వివాదం మొదలైందే.... సినిమాల మూలంగా. ఫిల్మ్ క్రిటిక్ అయిన మహేష్ కత్తి గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలను తన రివ్యూల్లో విమర్శించడం, దానికి పవన్ ఫ్యాన్స్ బూతులు తిడుతూ రెచ్చిపోవడంతో మొదలై ఇపుడు ఇంత పెద్దగా గొడవగా మారింది. 
Image result for కత్తి మహేష్ మహేష్ ఫ్యాన్స్
అయితే  కత్తి మహేష్ ఎక్కడా తగ్గడం లేదు..తనదైన స్టైల్లో కొత్త సినిమాలన్నింటికీ కాంట్రవర్సీ రివ్యూలు ఇస్తూనే ఉన్నారు.  ఈ నెల 15వ తేదీ వరకు సైలెంట్‌గా ఉండాలని మహేష్ కత్తికి కోన వెంకట్ సలహా ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఆయన ప్రస్తుతం నేరగా పవన్ కల్యాణ్ అభిమానులపై ఏ విధమైన వ్యాఖ్యలు కూడా చేయడం లేదు. తాజాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి మూవీ క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి ట్వీట్ చేశాడు.
Image result for కత్తి మహేష్ మహేష్ ఫ్యాన్స్
సంక్రాంతి పండగ కోసం కత్తి.. శనివారం సొంతూరు వెళ్లాడు. కార్లో పీలేరు వెళ్తున్నప్పుడు ఇద్దరు బైకర్లు ఫాలో అయ్యారని కత్తి చెప్పాడు.  జై పవన్ కళ్యాణ్ అని నినాదాలు చేశారని, దీన్ని వారు పవన్ ఫ్యాన్స్ అని అర్థమైందన్నాడు. విజయవాడ, తిరుపతి, మదనపల్లె, పుత్తూరు ప్రాంతాలకు చెందిన పవన్ అభిమానులు ఈ మధ్యే మా ఊరికి వచ్చారు. ఊరికెళ్లగానే నాకు ఈ విషయం అర్థమైందని కత్తి మహేష్ ట్వీట్ చేశాడు.

ఆ మద్య కత్తి మహేష్ పై దాడి చేస్తామని అన్నారని ఈ నేపథ్యంలో తనపై దాడి చేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేసి ఉండవ వచ్చని కత్తి మహేష్ అన్నారు. ఇటీవలే ఓయూ విద్యార్థులు కత్తికి మద్దతుగా పవన్‌కు వార్నింగ్ ఇచ్చారు. జ‌న‌వ‌రి 15 వ‌ర‌కు సైలెంట్‌గా ఉండాల‌న్న కోన వెంక‌ట్ స‌ల‌హాను మేరకు కత్తి కొద్ది రోజులుగా శాంతించాడు. కానీ పవన్ రీసెంట్ మూవీ అజ్ఞాతవాసి, బాలయ్యబాబు జైసింహా సినిమాలను విమర్శిస్తూ కత్తి ట్వీట్లు పెట్టడం వివాదాన్ని మరింత పెంచింది.


మరింత సమాచారం తెలుసుకోండి: