టాలీవుడ్ లో మెగా మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రెజీనా దక్షిణాది చిత్ర పరిశ్రమలో అందంతోపాటు అభినయంతో మెప్పించింది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న సమయంలో రెజీనాకు సడన్గా బ్రేక్ పడింది. తన కెరీర్ గ్రాఫ్ పడిపోవడానికి గల కారణాలను వెల్లడిస్తూ ఇటీవల ప్రముఖ దినపత్రికతో తన జీవితంలో జరిగిన కొన్ని చేధు అనుభవాలు గురించి చెప్పింది. ప్రేమ మత్తులో తన సినీ జీవితంలో చాలా తప్పులు జరిగాయంటూ సరికొత్త చర్చకు తెర తీసింది.
గత కొద్ది రోజులుగా టాలీవుడ్లో మెగా హీరో సాయిధరమ్తో ఈ భామ ప్రేమాయణం నడిపిస్తుందని ఊహాగానాలు వస్తుండగా... వాటికి మరింత బలం చేకూర్చేలా రెజీనా చేసిన తాజా వ్యాఖ్యలు టాలీవుడ్లో ఒక్కసారిగా కలకలం రేపుతున్నాయి. సదరు హీరోతో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన రెజీనా.. పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందట. కెరీర్ ఉన్నత స్థానంలో ఉన్నందున పెళ్లికి నో చెప్పినట్టు సమాచారం. వెలువడ్డాయి.
పదేళ్ల కెరీర్లో అనేక మలుపులు, ఒడిదుడుకులను చూశాను. ఆ కారణంగానే ఉన్నత స్థాయికి చేరుకోలేకపోయాను. ఇప్పుడు పలు అడ్డంకులను ఎదుర్కొని నన్ను నేను నిరూపించు కోవాలనుకొంటున్నాను. నటన అంటే నాకు చాలా ఇష్టం. ఆ కారణంగానే యాక్టర్ అయ్యాను. ప్రస్తుతం వాటిని సరిదిద్దుకొనేందుకు ప్రయత్నిస్తున్నాను.ఓ వ్యక్తితో ప్రేమలో పడటం కెరీర్పై దెబ్బ పడింది.
ఏదో తప్పు చేస్తున్నాను అనే సమయానికి పరిస్థితులు చేజారాయి. ఆ మత్తు వదిలే సరికి పుణ్యకాలం గడిచిపోయిందని చెప్పింది. ఇకపై ప్రేమ, పెళ్లి అనే ఆలోచనలకు స్థానం లేకుండా కేవలం కెరీర్పైనే దృష్టి పెడతానంటోంది. ఓవైపు ఆ హీరోతో త్వరలో పెళ్లి అంటూ... ఊహాగానాలు హల్ చల్ చేస్తుండగా రెజీనా తాజా వ్యాఖ్యలు మరిన్ని అనుమానాలకు తావిచ్చేలా ఉన్నాయి.
ప్రస్తుతం ప్రేమ మత్తు నుంచి బయటపడ్డాను. ఇకపై ప్రేమ, పెళ్లి అనే ఆలోచనలను వదిలేసి, కెరీర్పైనే పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తాను అని చెప్పినట్టు ఆ వార్త కథనం సారాంశం. అయితే ఎవరితో ప్రేమలో పడ్డాను. ఎందుకు ప్రేమ విఫలమైంది అనే విషయాలను వెల్లడించడానికి నిరాకరించింది.