బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి చేసే సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలుండగా.. మెగా నందమూరి మల్టీస్టారర్ గా ఓ సినిమా షురూ చేశాడు జక్కన్న. బాహుబలితో ప్రపంచమంతా తెలుగు సినిమా ప్రస్థానం గురించి మాట్లాడుకునేలా చేసిన రాజమౌళి ఆ తర్వాత సినిమా ఓ క్రేజీ మల్టీస్టారర్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ బయటకు వస్తుంది.


ఇన్నాళ్లు ఆ సినిమా బడ్జెట్ దాదాపు 150 కోట్ల దాకా ఉంటుందని.. ఇదో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న కథ అని అన్నారు. కాని అసలు విషయం ఏంటంటే సినిమాలో స్టార్స్ రెమ్యునరేషన్ కాకుండా కేవలం 40 కోట్లతో సినిమా పూర్తి చేస్తాడట. బడ్జెట్ కంట్రోలింగ్ కోసమా లేక ఆ కథకు అంత బడ్జెట్ మాత్రమే సరిపోతుందా అన్నది ఆలోచించారో తెలియదు కాని మొత్తానికి జక్కన్న మాత్రం కేవలం 40 కోట్లతో సినిమా ఫినిష్ చేయాలని ఫిక్స్ అయ్యాడు.


రెమ్యునరేషన్ లేకుండా తీసి ఏరియా వైజ్ పర్సెంటేజ్ తీసుకుంటారా లేక మరేదో కాని మొత్తానికి రాజమౌళి ఈ మెగా నందమూరి మల్టీస్టారర్ సినిమాతో పెద్ద స్కెచ్చే వేశాడని చెప్పొచ్చు. అంచనాలను అందుకుంటే కనుక ఈ సినిమా బడ్జెట్ ఎంతైనా రికార్డులు సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు. అక్టోబర్ లో మొదలవనున్న ఈ సినిమా 2019 సమ్మర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.


ప్రస్తుతం ఎన్.టి.ఆర్ త్రివిక్రం సినిమా.. చరణ్ బోయపాటి సినిమా చేస్తుండగా ఆ సినిమాలను పూర్తి చేసిన తర్వాత రాజమౌళి సినిమా చేస్తారట. ఇక ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అంటున్నారు. రాజమౌళి లాంటి డైరక్టర్ మెగా నందమూరి హీరోలు ఇక ఈ సినిమా రికార్డులకు రెండు ఫ్యామిలీల ఫ్యాన్స్ సాక్ష్యాలుగా ఉంటారని చెప్పొచ్చు. మరి ఈ అద్భుత దృశ్య కావ్యం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: