టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నరేష్ ఎన్నో కామెడీ చిత్రాల్లో నటించి మెప్పించారు.  ప్రముఖ దర్శకురాలు, నటిమణి విజయ నిర్మల వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నరేష్ కామెడీ సినిమాల్లో నటించి తనదైన మార్క్ చాటుకున్నారు.  90వ దశకంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ హీరోలు రాజేంద్ర ప్రసాద్, నరేష్ లు మాత్రమే కొనసాగారు.  ప్రస్తుతం వీరిద్దరూ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి తండ్రి, మామ ఇతర క్యారెక్టర్  పాత్రల్లో నటిస్తున్నారు. 

 వరుణ్ తేజ్ నటించిన  ‘తొలిప్రేమ’ ఆడియో రిలీజ్ వేడుకలో నరేష్ మాట్లాడుతూ...ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీతో తనకు ఎంతో అనుబంధం ఉందని..ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోలను చిన్నప్పటి నుంచి తాను చూస్తున్న విషయం గుర్తు చేసుకొన్నారు. బన్నీ, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ మా అబ్బాయి నవీన్ లను మూడు అడుగుల బుల్లెట్స్ లా చూశాను.. కానీ ఇప్పుడు వరుణ్ తేజ్ విషయానికి వస్తే త‌ను ఆరడుగుల నాలుగంగులాల బుల్లెట్‌లా త‌యార‌య్యాడని అన్నారు.
Image result
ఇండస్ట్రీలో వరుణ్ తేజ్ మంచి సినిమాలు తీస్తూ.. కెరీర్ లో దూసుకొని వెళ్ళాలి.. మంచి హిట్స్ అందుకోవాలి అని చెప్పారు.  ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాన్ గురించి మాట్లాడుతూ..ఆయన చాలా మంచి వ్యక్తి మంచి నటుడిగానే కాకుండా మంచి రాజకీయనాయకుడిగా పేరు తెచ్చుకుంటున్నారని..పవన్ ప్రజల మనిషి అని చెప్పారు.. ఆయన భవిష్యత్ చాలా బాగుండాలి అని కోరుకొంటున్నాను అని సీనియర్ నరేష్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: