ఇన్నాళ్లు సినీనటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటూ వస్తున్న మనం ఇకపై మాజీ సినీనటుడు అని సంబోధించాలేమో! ఎందుకంటే ఆయన ఇకపై సినిమాలు తీయబోనని తేల్చిచెప్పేశారు. తన యాత్ర ఆరంభించే ముందు కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనార్థము వచ్చిన ఆయన దర్శనం అనంతరం కరీంనగర్ లోని విలేకరుల సమావేశంలో విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ తాను ఇకపై సినిమాలలో నటించనని, ఇక పూర్తి స్థాయి రాజకీయనాయకుడిగా ఉండిపోతానని ఆయన బదులిచ్చాడు. 


ఇప్పటినుండి తన దృష్టి అంతా రాజకీయాలపైనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణా రాజకీయాల గురించి ఆయన స్పందిస్తూ తనకు తెలంగాణ అంటే చాలా ఇష్టమని, ఇక్కడ ఉన్న సమస్యల గురించి పోరాడతాను తప్ప ఇక్కడ ఎన్నికలలో పోటీచేసే ఉద్దేశం లేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తనకు ఇష్టమైన దైవం ఆంజనేయస్వామిని దర్శించుకోవడానికి కారణం ఆయనను పూజించడం వల్ల ఎనలేని శక్తి వస్తుందని,అన్ని సాధ్యం అవుతాయని ఆయన పేర్కొన్నారు.


తెలంగాణలో ఉన్న సమస్యల గురించి  జనసేన టీం అధ్యయనం చేస్తోంది. అంతటితోఆగిపోకుండా తెలంగాణా రాష్ట్రం మొత్తంలో ఉన్న అన్ని జిల్లాలకు సంబందించిన జనసేన కార్యకర్తలతో సమస్యలపై చర్చిస్తానని ఆయన చెప్పుకొచ్చాడు. సేకరించిన అన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని సత్వరం పరిష్కరించేలా చొరవతీసుకుంటామని ఆయన వెల్లడించారు. మేము బలంగా ఉన్న స్థానాలలో అవసరమైతే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నాడు. కాగా ఆయన చెప్పిన వార్త విని అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు. సినిమాలలో చేస్తూ రాజకీయాలు కొనసాగించాలని వేడుకుంటున్నారు. మరి పవన్ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఏమో!


మరింత సమాచారం తెలుసుకోండి: