జనసేన అధినేత తన రాజకీయా యాత్రను మొదలు పెట్టాడు. ఇన్నాళ్లు సగం సినిమాలు సగం పాలిటిక్స్ అంటూ వచ్చిన పవన్ ఇప్పుడు పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చేశాడు. నిన్న కొండగట్టు నుండి పవన్ తన రాజకీయ యాత్రం మొదలు పెట్టాడు. ఆ తర్వాత కరీంనగర్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడారు. తన యాత్ర గురించి చెప్పిన పవన్ సినిమాలను పక్కన పెట్టేశాను అని చెప్పడం అందరిని ఆశ్చర్యపరచింది.


కేవలం ఎన్నికల దాకా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టాడా లేక నిజంగానే పవన్ ఇక సినిమాలు తీయడా అన్న ఆలోచనలు మొదలయ్యాయి. సినిమా హీరోగానే పవన్ కళ్యాణ్ ను కాస్త పవర్ స్టార్ ను చేశారు అభిమానులు. అజ్ఞాతవాసి హిట్ అయ్యి పవన్ ఇలాంటి డెశిషన్ తీసుకున్నా ఓకే కాని అది డిజాస్టర్ అయ్యింది కాబట్టి పవన్ నుండి ఓ సూపర్ హిట్ ఆశిస్తున్నారు ఫ్యాన్స్.


మొన్నటిదాకా సంతోష్ శ్రీనివాస్ తో మైత్రి మేకర్స్ నిర్మిస్తున్న సినిమాలో పవన్ నటిస్తాడని అన్నారు. అంతేకాదు ఏ.ఎం.రత్నం నిర్మాణంలో నీసన్ డైరక్షన్ లో మూవీ కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. తీరా పవన్ చూస్తే సినిమాలను ఇక పక్కన పెట్టేసినట్టే అంటూ మాట్లాడుతున్నాడు. మరి ఇందులో ఏది వాస్తవం అన్నది తెలియాల్సి ఉంది.


పవన్ స్వయంగా చెప్పాడు కాబట్టి కచ్చితంగా సినిమాలకు కొంత కాలం దూరంగా ఉంటాడని తెలుస్తుంది. అయితే ఎన్నికల తర్వాత పరిస్థితిని బట్టి సినిమాలు చేయాలా వద్దా అని నిర్ణయించుకుంటారట. పవన్ జనసేన రాజకీయ యాత్ర తెలుగు రెండు రాష్ట్రాల్లో పవన్ అభిమానులకు, జనసేన కార్యకర్తలకు ఉత్సాహాన్ని తెచ్చింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: