మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా రంగస్థలం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచగా ఈరోజు సినిమాకు సంబందించిన ఫస్ట్ టీజర్ రిలీజ్ చేస్తారట. పల్లెటూరి ప్రేకథగా రాబోతున్న ఈ సినిమాలో చరణ్ లుక్ కొత్తగా ఉంది.


సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా నుండి లీక్ అయిన పిక్స్ అంచనాలను పెంచేయగా ఇప్పుడు ఈ టీజర్ గురించి అందరు ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ మార్క్ సినిమాగా రాబోతున్న రంగస్థలం సినిమా టీజర్ తోనే సంచలనం సృష్టిస్తుందని అంటున్నారు. 


ఈరోజు సాయంత్రం 4:15 నిమిషాలకు రంగస్థలం టీజర్ రిలీజ్ చేస్తున్నారట. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సాంగ్స్ కూడా ప్రత్యేకంగా ఉండబోతున్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా సుక్కు సినిమాలకు దేవి ఇచ్చే మ్యూజిక్ ఓ రేంజ్ లో ఉంటుంది. ధ్రువ తర్వాత చరణ్ నుండి వస్తున్న ఈ రంగస్థలం కచ్చితంగా రికార్డులను కొల్లగొట్టడం ఖాయమని అంటున్నారు.


ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా దుమ్మురేపుతున్న రంగస్థలం మార్చి 30న రిలీజ్ కాబోతుంది. అంచనాలను అందుకునేలా ఉంటే మాత్రం మెగా పవర్ స్టార్ కు ఇది తప్పకుండా ఘనవిజయం అందించే సినిమా అవుతుందని అంటున్నారు. మరి సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: