ఫ్యాన్స్ తమ అభిమాన హీరోల గురించి ఎంతకైనా తెగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని ఇబ్బందులు పడటం..ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం జరుగుతుంది. ఈ మద్య పవన్ కళ్యాన్ తెలంగాణ టూర్ లో ఓ యువకుడు ఒళ్లంతా దెబ్బలు తిని రక్తం కారుతున్నా..పవన్ తో ఫోటో దిగాలని ఆరాటపడ్డారు. ఆ తర్వాత ఏపీలో మరో యువకుడు అందరినీ నెట్టుకుంటూ డయాస్ పై ఉన్న పవన్ కి కౌగిలించుకున్నాడు.
తర్వాత పవన్ తో సెల్ఫీ తీయించుకున్నాడు. తాజాగా ప్రముఖ నటుడు, కొరియో గ్రాఫర్ రాఘవ లారెన్స్ తో కలిసి ఫొటో దిగేందుకు శేఖర్ అనే అభిమాని వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో లారెన్స్ ఎంతో కలత చెంది ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ‘హాయ్ డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్...! నా వీరాభిమాని ఆర్.శేఖర్ నాతో ఫొటో దిగేందుకు తన ఇంటి నుంచి బయలుదేరి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం అందరికీ తెలుసు.
అతని అంత్యక్రియల్లో నేను పాల్గొన్నాను. ఈ సంఘటన నన్ను ఎంతో బాధకు గురిచేసింది.ఈ సంఘటనతో నేనో నిర్ణయానికి వచ్చాను. ఇకపై, నాతో కలిసి ఫొటో దిగేందుకు అభిమానులు నా దగ్గరకు రావాల్సిన అవసరం లేదు. అభిమానుల వద్దకే నేను వస్తాను. ఈ నెల 7న సేలంకు వస్తున్నాను.. శేఖర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ అని ఆ ట్వీట్ లో లారెన్స్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తన అభిమాని శేఖర్ ఫొటోను పోస్ట్ చేశాడు.