కత్తి మహేష్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. ఏకంగా పవన్ కళ్యాణ్ ను సిఎం గా సంభోదించాడు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఈ నెల 21 నుంచి న్యూఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేయనున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు నా మద్దతు తెలుపుతున్నాను" అని మహేష్ ట్వీట్ చేశారు.
Image result for kathi mahesh and pawan kalyan
కొద్ది రోజుల క్రితం వరకూ పవన్‌పై కారాలు మిరియాలూ నూరిన కత్తి మహేష్ ఇప్పుడిలా ట్వీట్ చేయడం ఆశ్చర్యపరుస్తోంది. అయితే మరికొద్ది సేపట్లో పవన్ ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారని వార్తలు వచ్చాయి. ఈ ప్రెస్‌మీట్‌లో పవన్ తన కార్యాచరణను వెల్లడిస్తారేమో వేచి చూడాలి. కాగా, ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్ అట్టుడుకుతోంది. లోక్‌సభలో టీడీపీ ఎంపీలు ఈ విషయమై ఆందోళన చేపడుతున్నారు.
Image result for kathi mahesh and pawan kalyan
మరోవైపు వైసీపీ ఎంపీలు బుధవారం సభ నుంచి వాకౌట్ చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ అంశంపై తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ కత్తి మహేష్ మాత్రం పవన్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారని.. తన పూర్తి మద్దతు పవన్‌కే అని తెలియజేస్తూ ఓ ట్వీట్ చేశారు.  అయితే ఈ ట్వీట్ ఇప్పుడు సెన్సేషన్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఆమరణ నిరాహార దీక్షచేస్తానని చెప్పలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: