టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్,ఏఎన్ఆర్ ల తర్వాత ఆ రేంజ్ లో మాస్ ఫాలోయింగ్ సంపాదించిన హీరో మెగాస్టార్ చిరంజీవి.  పది సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వెళ్లిన చిరంజీవి కేంద్ర మంత్రిగా వ్యవహరించారు.  గత సంవత్సరం వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో మళ్లీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.   ఈ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చిరంజీవి త్వరలో ట్రీట్ మెంట్ కోసం వైజాగ్ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ చిరుకేమైంది? ఏం ట్రీట్‌మెంట్ చేయించుకోబోతున్నారనే కదా మీ డౌట్. ఆయన చేయించుకోబోయే ట్రీట్‌మెంట్ కారణంగా బాడీ కాంతివంతమవుతుందట.. అలాగే స్కిన్ కూడా రేడియేట్ అవుతుందని సమాచారం. ఇప్పటికే..  'సైరా' నరసింహారెడ్డి చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. సెకండ్ షెడ్యూల్ ఆరంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
Image result for చిరంజీవి ట్రీట్ మెంట్
ఫస్ట్ షెడ్యూల్ లో యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించారు. సెకండ్ షెడ్యూల్ లో చిరు, నయనతారలపై రొమాంటిక్ ఎపిసోడ్స్, డ్రామా సీక్వెన్స్ చిత్రీకరించబోతున్నారట. కాగా ఈ ఎపిసోడ్స్ చిత్రీకరించేటప్పుడు ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది.
Image result for seayraia narasimha reddy
ఇవన్ని దృష్టిలో పెట్టుకుని ఓ వారం పాటు న్యాచురోపతి ట్రీట్ మెంట్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారట చిరు.. ఈ ట్రీట్ మెంట్ తీసుకున్నవారిలో స్పష్టంగా ఈ మార్పులు కనిపిస్తున్నాయట. అందుకే చిరు ఈ ట్రీట్ మెంట్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారట.రామ్ చరణ్ నిర్మాణంలో 'సైరా' సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: