భారతీయ చలన చిత్ర రంగంలో ఎన్నో సంచలనాలు సృష్టించిన సినిమా ‘బాహుబలి, బాహుబలి2’. దర్శకధీరుడు రాజమౌళి ఐదు సంవత్సరాలు కష్టపడి తెరకెక్కించిన ఈ చిత్రం భారత్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి..ఎన్నో రికార్డులు సృష్టించింది. అంతే కాదు భారత దేశంలో అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా మరో ఘనత సాధించింది. తెలుగు లో ఇప్పటి వరకు ఏ సినిమాకూడా ఇంత గొప్పగా తెరకెక్కలేదని రాజమౌళికి ఎన్నో ప్రశంసలు అందాయి. ఈ సినిమాలో నటించిన ప్రభాస్, రానా, అనుష్క లకు జాతీయ స్థాయిలో మంచి నటులుగా గుర్తింపు వచ్చింది.
అయితే బాహబలి భారత్ లో పలు భాషల్లో డబ్బింగ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా బాహుబలి రిమేక్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాని భోజ్పూరి నటుడు దినేశ్ లాల్ యాదవ్ నిరహువా రీమేక్ చేస్తున్నాడు. దీనికి ‘వీర్ యోధ మహాబలి’ పేరు పెట్టారు. అమ్రపాలి డుబే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్లుక్ను ఇటీవల మూవీ టీమ్ విడుదల చేసింది.ప్రస్తుతం సినిమా ప్రోమోలకు సంబంధించిన చిత్రీకరణ మహారాష్ట్రలోని ఓ గ్రామంలో జరుగుతోంది.
2018 జనవరి 15న టీజర్ను విడుదల చేయనున్నారు. ఇక్బాల్ భక్ష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దినేశ్లాల్కి జోడీగా ఆమ్రపాలి దుబే నటిస్తున్నారు. ఈ సినిమాకి ‘వీర్ యోధ మహాబలి’ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు తెలిపారు.వీర్ యోధ మహాబలి'..... బాహుబలికి కాపీ అని కొందరు, రీమేక్ అని కొందరు అంటున్నారు. మరి ఈ ఆరోపణల్లో నిజం ఎంతో తేలాల్సి ఉంది.మహాబలి చిత్ర నిర్మాతలు మాత్రం ఇది రీమేక్ అని ఇప్పటి వరకు ప్రకటించలేదు. ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా ఈ పోస్టర్ షేర్ చేశారు.
అయితే ఈ పస్ట్ లుక్ చూసి బాహుబి సినిమా అభిమానులంతా షాకవుతున్నారు. హీరో గెటప్, బ్యాక్ డ్రాప్ కూడా బాహుబలిని పోలి ఉండటమే ఇందుకు కారణం. ఈ చిత్రాన్ని భోజ్పురితో పాటు హిందీ, తెలుగు, తమిళ్, బెంగాళీ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. కాగా, ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి’ రెండు విభాగాలు అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళం.. తదితర భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. పలు విదేశీ భాషల్లోనూ ఈ సినిమా విడుదలైంది.