నాగ శౌర్య హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా వెంకీ కుడుముల డైరక్షన్ లో వచ్చిన సినిమా ఛలో. ఈ నెల 2న రిలీజ్ అయిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. మొదటి షో నుండి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా కమర్షియల్ గా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా సక్సెస్ జోష్ లో ఉన్న నాగ శౌర్య సినిమాకు పనిచేసిన యూనిట్ అంతటికి గిఫ్టులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట. 


ఇప్పటికే వైజాగ్ లో సక్సెస్ మీట్ పూర్తిచేసుకోగా.. ఇప్పుడు చిత్రయూనిట్ వరకు ఓ స్పెషల్ పార్టీ ఎరేంజ్ చేస్తున్నారట. పార్టీ మాత్రమే కాదు ఛలోకి పంచేసిన టీం అంతటికి వారి వారి కంట్రిబ్యూషన్ ను బట్టి కానుకలు ఇస్తున్నారట. నాగ శౌర్య సొంతంగా నిర్మించిన ఈ సినిమా సక్సెస్ తన కెరియర్ కు చాలా హెల్ప్ అయ్యింది. 


ఇక ఈ సినిమా డైరక్టర్ వెంకీ కుడుకుమలు కాస్ట్ లీ కారు గిఫ్ట్ గా ఇస్తున్నారట. నాగ శౌర్య కెరియర్ లో ఛలో మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. కన్నడ భామ రష్మిక మందన కూడా ఈ సినిమాతో క్రేజ్ సంపాదించుకుంది. సినిమాకు మ్యూజిక్ అందించిన మణిశర్మ తనయుడు సాగర్ మహతి కూడా సినిమా సక్సెస్ లో తనవంతు కృషి చేశాడు. 


మ్యూజికల్, ఫన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్ కు లాభాలు తెచ్చి పెట్టింది. ఈ సినిమాతో టాలెంట్ చూపించిన వెంకీ కుడుములకు క్రేజీ ఆఫర్లు వస్తున్నాయట. ఇక కానుకలతో పాటుగా ఇదే టీంతో మరో సినిమా చేయాలని చూస్తున్నారట దర్శక నిర్మాతలు. 



మరింత సమాచారం తెలుసుకోండి: