హీరోగా సూపర్ సక్సెస్ లను అందుకుంటూ ఓ రేంజ్ ఫాంలో ఉన్న నాని సడెన్ గా నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నాడు. డి ఫర్ దోపిడి సినిమాతో సహ నిర్మాతగా చేతులు కాల్చుకున్న నాని అ! సినిమాకు పూర్తి నిర్మాణ బాధ్యతను మీద వేసుకున్నాడు. ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో తెరకెక్కిన అ! సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 


ఇక ఈ సినిమా ప్రీమియర్ షోస్ చూసిన సిని సెలబ్రిటీస్ అంతా సినిమా సూపర్ అనేస్తున్నారు. అంతేకాదు ఇలాంటి సినిమా తీయాలంటే ధైర్యం ఉండాలని.. టాలీవుడ్ లో ఇది పాత్ బ్రేకింగ్ సినిమా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నాని దగ్గరకు జస్ట్ వాయిస్ ఓవర్ కోసం వచ్చిన ప్రశాంత్ వర్మ ఈ సినిమా తనే ప్రొడ్యూస్ చేస్తా అనేంతలా కథ నచ్చిందట.


నాని నిర్మాణంలో వస్తున్న ఈ అ! సినిమా కచ్చితంగా తెలుగులో ప్రత్యేకమైన సినిమా అంటున్నారు. కాజల్, రెజినా, నిత్యా మీనన్, ఈషా రెబ్బ, అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శి ఈ సినిమాలో నటించారు. చేపకు నాని, మొక్కకు రవితేజ వాయిస్ అందించారు. ఇక ఈ సినిమా చూసిన సెలబ్రిటీస్ లో ఒకరైన బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ నానిని మెచ్చుకుంటున్నారు. 


ఇలాంటి సినిమా చూసిన వెంటనే కాకుండా కాస్త ఆలోచించి రివ్యూ రాయాలని కూడా చెప్పారు. నాని మనసు పెట్టి నిర్మించిన ఈ సినిమా కచ్చితంగా నిర్మాతగా సక్సెస్ ఇస్తుందని అంటున్నారు. మరి ఈ సినిమా అంచనాలను అందుకునేలా ఉంటుందో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: