నాచురల్ స్టార్ నాని కాదన్న డైరక్టర్ తన తర్వాత సినిమా కన్ఫాం చేశాడు మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్. ఇంతకీ నాని ఏ డైరక్టర్ ను కాదన్నాడు.. ఆ దర్శకుడు తేజూకి ఎలా కనెక్ట్ అయ్యాడు అంటే. నేను శైలజ సినిమాతో రామ్ కు మంచి హిట్ ఇచ్చిన కిశోర్ తిరుమల ఆ తర్వాత కూడా రామ్ తో ఉన్నది ఒకటే జిందగి సినిమా చేశాడు.  


అయితే నేను శైలజ మ్యాజిక్ రిపీట్ చేయలేని ఉన్నది ఒకటే జిందగి సినిమా యావరేజ్ గా నిలిచింది. కలక్షన్ వైజ్ చెప్పాలంటే ప్రాజెక్ట్ లాస్ తెచ్చి పెట్టింది. అయితే కిశోర్ ఆ సినిమా తర్వాత నానితో చిత్రలహరి సినిమా చేయాలని చూశాడు. కథ అంతా ఓకే అయ్యింది అనుకున్న టైం లో నాని ఎందుకో ఆ డైరక్టర్ విషయంలో వెనక్కి తగ్గాడు.


నాని కాదన్న ఆ సినిమానే మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ తో తీస్తున్నాడు కిశోర్. ఇంతకుముందు కూడా వెంకటేష్ తో ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా ఎనౌన్స్ చేసిన కిశోర్ ఆ సినిమా నుండి వెనక్కి తగ్గాడు. ఒకసారి ఓకే అనుకున్న కథ ఎందుకు మిడిల్ డ్రాప్ అవుతున్నాయో తెలియాల్సి ఉంది. 


మొత్తానికి ఫైనల్ గా మెగా హీరోతో కిశోర్ ప్రాజెక్ట్ కన్ఫాం అయ్యింది. ఇంటిలిజెంట్ ఫ్లాప్ తో కెరియర్ మరి సందిగ్ధంలో పడేసుకోగా.. కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కరుణాకరణ్ తో లవ్ స్టోరీ తీస్తున్న తేజూ ఆ తర్వాత చంద్ర శేఖర్ యేలేటి సినిమా తీస్తున్నాడు. ఈ రెండు పూర్తయ్యాక కిశోర్ సినిమా ఉంటుంది. సినిమా స్ట్రంగుల్ నేపథ్యంలో సాగే ఈ కథకు చిత్రలహరి అని టైటిల్ నిర్ణయించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: