రొటీన్ కథలతో ప్రేక్షకుల బుర్రలను వేడెక్కించేస్తున్న సినిమాలు ఓవైపైతే.. ఒక్క ఛాన్స్ వస్తే చాలు తమ సత్తా చాటుతాం అనుకుంటూ వస్తున్న నూతన దర్శకులు మరోవైపు. సరికొత్త పంథాలో కథ, కథనం.. తెలుగు సినిమా ప్రస్థానాన్ని మరింత అప్రతిహాతంగా కొనసాగించే సత్తా తమకు ఉందంటూ కొత్త కోణంలో ఆలోచిస్తూ కథలను రాస్తూ.. సినిమాలు తీస్తూ వస్తున్నారు.   


ఇక ఇదే కోవలో మరో సినిమా రాబోతుంది. ఇంత స్పెషల్ ఏంటి అంటే.. ఐడియానే కథగా రాసుకుని.. ఆ ఐడియాతోనే సినిమాకు కావాల్సిన సరంజామా సెట్ చేసుకుని చేస్తున్న సినిమా ఇది.. ఇంతకీ ఏంటి ఈ సినిమా స్పెషల్ అంటే.. మనిషి జీవితాన్ని మార్చే ఐడియానే ఈ సినిమా కథ. ఈ కథను ఎంచుకుంది ఎవరు అంటే నిర్మాతగా తన అభిరుచిని చాటుతూ పిల్లజమిందార్ లాంటి హిట్ సినిమా తీసిన నిర్మాత డి.ఎస్ రావు ఏరి కోరి మరి మెచ్చిన కథ ఇది.


ఇక ప్రముఖ దర్శకుల దగ్గర సహాయక దర్శకుడిగా పనిచేసి, దర్శకుడిగా తన ప్రతిభ చాటాలనుకునే నూతన దర్శకుడు రాజశేఖర్ రావి తొలి ప్రయత్నం ఇది. శ్రీశైలేంద్ర సినిమాస్ బ్యానర్లో ఈ సినిమా వస్తుండగా.. సినిమా మీద అభిరుచితో యువ నిర్మాతగా అడుగుపెడుతున్నారు తేజా చండ్రా. చండ్రా ఆర్ట్స్ బ్యానర్లో  యాడ్ ఫిలింస్ తీస్తూ.. ఫీచర్ ఫిల్మ్ చేసేందుకు ముందుకొస్తున్నారు చండ్రా తేజా.   


కథ, కథనం ఎవరు ఊహించని విధంగా ఈ సినిమా ఉంటుందట. ముహుర్త కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాలో లీడింగ్ ఆర్టిస్టులు నటిస్తారని తెలుస్తుంది. హీరో హీరోయిన్ లేకుండా సినిమా ఓపెనింగ్ చేయడం కూడా దర్శకుడి ఐడియాలోని లాజిక్ అని తెలుస్తుంది. మొత్తానికి మరో టాలెంటెడ్ డైరక్టర్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. ఇదవరకు షార్ట్ ఫిలిమ్స్ తో ప్రతిభ చాటిన రాజశేఖర్ ఫీచర్ మూవీతో ఏ రేంజ్ లో సత్తా చాటుతాడో చూడాలి.    



మరింత సమాచారం తెలుసుకోండి: