బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ సూపర్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. మొదటి సినిమా నుండి చేస్తున్న సాక్ష్యం వరకు హీరోయిన్స్ విషయంలో మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ కాడు బెల్లంకొండ శ్రీనివాస్. అల్లుడు శీను సినిమాలో సమంత హీరోయిన్ కాగా.. తమన్నాతో ఐటం సాంగ్ చేయించారు. ఇక ఆ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ తో కూడా రొమాన్స్ చేశాడు.


ప్రస్తుతం సాక్ష్యం సినిమాలో డిజే భామ పూజా హెగ్దె ని ఎంపిక చేసిన బెల్లంకొండ బాబు ఆమెతో కూడా రొమాన్స్ అదిరిపోయేలా చేస్తాడట. చూస్తుంటే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోయిన్స్ విషయంలో స్టార్స్ ఉండేలా చూసుకుంటున్నాడు. సినిమాకు వారు ఎట్రాక్షన్ గా ఉంటారనేది తెలిసిందే. ఇక ఇప్పుడు బెల్లంకొండ నటించబోయే తర్వాత సినిమాలో కూడా కాజల్ ను హీరోయిన్ గా ఫైనల్ చేశారట.


శ్రీనివాస్ అనే నూతన దర్శకుడు డైరక్షన్ లో వస్తున్న సినిమాలో కాజల్ హీరోయిన్ గా తీసుకున్నారట. వంశధార క్రియేషన్స్ లో నవీన్ సొంటినేని ఈ సినిమా నిర్మిస్తున్నారట. కెరియర్ మంచి ఉత్సాహంగా కొనసాగిస్తున్న కాజల్ అ! సినిమాలో ఆశ్చర్యపరచగా.. కళ్యాణ్ రాం ఎం.ఎల్.ఏ సినిమాలో కూడా నటిస్తుంది.


కాజల్ తో బెల్లంకొండ బాబు సినిమా అంటే సినిమా క్రేజ్ మరింత పెరిగింది. ఈమధ్యనే మొదలైన ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూట్స్ కు వెళ్లనుంది. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితం అందిస్తుందో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: