మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నట సింహం బాలకృష్ణ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే.. అబ్బో ఆ సినిమా సంచలనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించవచ్చు. మెగా, నందమూరి అభిమానులతో ఆ సినిమా ఈజీగా రికార్డ్ కలక్షన్స్ వసూళు చేస్తుంది. అయితే ఈ కాంబో కోసం స్టార్ డైరక్టర్ ట్రై చేసినా వర్క్ అవుట్ కాలేదు.. కాని ఈ కాంబో సినిమా తన డ్రీం ప్రాజెక్ట్ అంటున్నాడు నూతన దర్శకుడు. 


నాని నిర్మాతగా అ! సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు ప్రశాంత్ వర్మ. సినిమా చూశాక ఇలాంటి కథలున్న సినిమాలు తెలుగులో వస్తాయా అన్న ఆలోచన రాక మానదు. కమర్షియల్ పంథాలో వెళ్తున్న టాలీవుడ్ ఓ డిఫరెంట్ అటెంప్ట్ చేసి ఆశ్చర్యపరచాడు ప్రశాంత్ వర్మ. ఇక ఈమధ్యనే తను ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో బాలయ్య, చిరంజీవిల మల్టీస్టారర్ డైరెక్ట్ చేయాలని ఉందని అన్నాడు.


మరి మనోడి దగ్గర ఆ కథ ఉందో లేక ఆ కథ రెడీ చేసి వారిని కలుస్తా అంటున్నాడో కాని కుర్రాడి కసి చూస్తే నిజంగానే వారిద్దరి ఒప్పించి సినిమా తీసేలా ఉన్నాడు. మెగా, నందమూరి కాంబోలో సినిమా అంటే అనుకున్నంత ఈజీ ఏం కాదు. కోట్ల మంది అభిమానులను సంతోష పెట్టేలా ఉండే కథ కావాలి. 


ప్రశాంత్ వర్మ తలచుకుంటే అలాంటి కథను ఇచ్చేయగలదని అ! తో నిరూపించుకున్నాడు. ఇక తన దగ్గర 30 దాకా కథలు ఉన్నాయని చెబుతున్న ఈ దర్శకుడు తన నెక్ష్ట్ సినిమాను త్వరలో ఎనౌన్స్ చేస్తానని అంటున్నాడు. అది కూడా ప్రయత్నమే అవుతుందా లేక కమర్షియల్ సినిమా చేస్తాడా అన్నది వేచి చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: