శ్రీదేవి మరణంతో ఢీలా పడ్డ ఆమె పెద్ద కుమార్తె జాన్వీ కపూర్, ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో తన పుట్టినరోజు ముందు "నువ్వు గర్వపడేలా చేస్తానని" అంటూ శ్రీదేవికి సోషల్ మీడియా వేదికగా మాటిచ్చిన జాన్వీ.. ఇప్పుడు ఆ మాటను నెరవేర్చుకునే క్రమంలో పడింది.  శ్రీదేవి వారసురాలిగా త్వరలో వెండితెరపైకి రానున్న జాన్వీ కపూర్, తన తొలి చిత్రం 'ధడక్' షూటింగ్ కు తిరిగి వచ్చింది.
Image result for 'ధడక్' షూటింగ్
తల్లి మరణించిన 10 రోజుల తరువాత, ఆ బాధను మనసులోనే దిగమింగిన జాన్వీ, సినిమా షూటింగ్ లో జాయిన్ కాగా, ఆ చిత్రాలను యూనిట్ అభిమానులతో పంచుకుంటూ, చేసే పనిపై జాన్వీ చూపిన శ్రద్ధను మెచ్చుకుంది.   జాన్వీ దఢక్ షూటింగ్‌లో పాల్గొనగా.. హీరో ఇషాన్, జాన్వీలపై కొన్ని సన్నివేశాలను దర్శకుడు శశాంక్ కైతాన్ తెరకెక్కించాడు. తన వలన సినిమా విడుదల విషయంలో జాప్యం జరగకూడదని భావించిన జాన్వీ.. బాధను దిగమింగుకొని మరీ షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
Image result for 'ధడక్' షూటింగ్
సూపర్ హిట్ అయిన మరాఠీ చిత్రం 'సైరాత్' హిందీ రీమేక్ గా ఈ చిత్రం తయారవుతున్న సంగతి తెలిసిందే. సైరాత్ ఇంటర్వెల్ తరువాత కనిపించే హైదరాబాద్ దృశ్యాలు... హిందీలో కోల్ కతా నగరంలో షూట్ చేయనున్నారు. సింపుల్ ఆలివ్ గ్రీన్ శారీతో.. పోనీ వేసుకుని కనిపించింది. విండో దగ్గర ఆమెతో ఓ సీన్‌ను షూట్ చేశారు.
 Image result for 'ధడక్' షూటింగ్
ఇటీవలే జాన్వి తన తండ్రి బోనీ కపూర్‌తో కలిసి తన తల్లి అస్థికలను రామేశ్వరంలో కలిపారు. అనంతరం గురువారం బోనీ హరిద్వార్‌లో తన భార్య శ్రీదేవి కోసం ప్రార్థన ఏర్పాటు చేయించారు. ఈ కార్యక్రమానికి అనిల్ కపూర్, డిజైనర్ మనీష్ మల్హోత్ర, అమర్ సింగ్, మిగిలిన ఫ్యామిలీ మెంబర్ హాజరయ్యారు.

Image result for 'ధడక్' షూటింగ్


మరింత సమాచారం తెలుసుకోండి: