సావిత్రి బయోపిక్ గా మహానటి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఎవడే సుబ్రమణ్యం డైరక్టర్ నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో లీడ్ రోల్ లో కీర్తి సురేష్ నటిస్తుండగా.. జమునగా సమంత, జెమిని గణేశన్ గా దుల్కర్ సల్మాన్, ఎస్వీ రంగారావుగా మోహన్ బాబు, నాగిరెడ్డిగా ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారు.


ఇక సినిమా ముఖ్య పాత్రలైన ఎన్.టి.ఆర్, ఏయన్నార్ పాత్రలకు వారి మనవళ్లను నటింపచేయాలని చూస్తున్నారు. ఎన్.టి.ఆర్ గా జూనియర్ ను అడుగగా ఏమాత్రం ఛాన్స్ లేదని చెప్పేశాడట. తాత పాత్రలో తారక్ ఎందుకు కాదన్నాడో కాని ఏయన్నార్ గా మాత్రం ముందు కాదనేసిన నాగ చైతన్య ఫైనల్ గా అందుకు ఒప్పుకున్నాడట.


ఏయన్నార్ మనవడిగా వేరొకరి బయోపిక్ లో ఆయనలా కనిపించడం అంటే నిజంగా అదృష్టమని చెప్పొచ్చు. కేవలం కొంతమందికి మాత్రమే దక్కే ఈ అవకాశాన్ని నాగ చైతన్య వాడుకుంటున్నాడు. ఈ సినిమా కోసం చైతు రెండు రోజులు డేట్స్ ఇస్తున్నాడట. సావిత్రి కెరియర్ లో ఎన్.టి.ఆర్, ఏయన్నార్ లు చాలా ప్రాముఖ్యత వహించారు. మహానటితో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. 


ఇక ఏయన్నార్ పాత్ర కన్ ఫ్యూజన్ క్లియర్ అవగా.. ఇప్పుడు ఎన్.టి.ఆర్ గా ఎవరన్నది తెలియాల్సి ఉంది. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం గ్రాఫిక్స్ పెట్టేసి మ్యానేజ్ చేస్తారని అంటున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం అన్నది తెలియాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: