ఈ రోజుల్లో ఈ కామా పిశాచులు ఎంత గా తెగిస్తున్నారంటే వారేమి చేస్తున్నారో వారికే అర్ధం కావడం లేదు. సభ్య సమాజం లో అన్ని మరిచి పోయి మరీ అడవి మనుషుల్లా ప్రవర్తిస్తున్నారు. మారుతున్న కాలం తో పాటు ఈ కామా వాంఛ కూడా భయంకరమైన స్థితికి చేరుకుంటుంది. వివారల్లోకి వెళితే హైదరాబాద్ నగర శివారు దుండిగల్లో నివసిస్తున్న ఉమర్ పాషాకు.. ఎంఎస్ మక్తా నివాసి షబానా బేగం కుమార్తె రేష్మా సుల్తానాకు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు.
ఆడపిల్లలు పుట్టారని కొంతకాలంగా భార్యను వేధిస్తున్నాడు ఉమర్. ఉమర్పాషా ఇంటర్నెట్లో అశ్లీల వీడియోలు చూడటంతోపాటు తనకు నచ్చినట్టు నడుచుకోవాలని భార్యను వేధించేవాడు. ఆమె అంగీకరించకపోవడంతో తరచూ దాడిచేసేవాడు. ఇటీవల కూడా భార్యకు అశ్లీల వీడియోలు చూపించి వేధించాడు. విసిగిపోయిన ఆమె వైఫై స్విచ్చాఫ్ చేసింది. కోపోద్రికుడైన పాషా భార్య తల, ఛాతి, ముఖంపై పిడిగుద్దులు గుద్దాడు.
ఆమె అత్తమామలు కూడా కొడుకుకే వత్తాసు పలకడంతో మరింత రెచ్చిపోయి రేష్మాపై దాడిచేశాడు. అతడి దెబ్బలకు తాళలకే అపస్మారకస్థితికి చేరుకోవడంతో.. అర్ధరాత్రి 2గంటల ప్రాంతంలో ఆమెను తీసుకెళ్లి మక్తాలోని ఆమె తల్లి ఇంటివద్ద పడేసి.. తలుపుకొట్టి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. కుమార్తెను చూసిన తల్లి.. స్థానికుల సహాయంతో ఆస్పత్రిలో చేర్చి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముందు ఘటన ఇక్కడే జరిగిందని భావించి కేసు నమోదు చేసిన పోలీసులు.. రేష్మా కోలుకున్న తర్వాత వాంగ్మూలం తీసుకొని కేసును దుండిగల్ పోలీసులకు అప్పగించారు.