రాం చరణ్, సుకుమార్ మొదటిసారి కలిసి చేస్తున్న సినిమా రంగస్థలం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా మార్చి 30న రిలీజ్ అవుతుంది. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పల్లెటూరి కథగా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మొత్తం ఐదుగురి పాత్రల మీదే నడుస్తుందని అంటున్నారు. 


హీరో, హీరోయిన్ తో కలుపుకుని ఐదుగురని తెలుస్తుంది. మరి వీరిద్దరు కాకుండా మిగిలిన ఆ ముగ్గురు ఎవరంటే ఆది పినిశెట్టి, జగపతి బాబు, అనసూయ అని చెబుతున్నారు. సినిమాలో ఆది చరణ్ కు అన్నగా నటిస్తున్నాడు. ఈమధ్యనే రంగస్థలంలో అతనికి సంబందించిన పిక్ లీక్ అయ్యింది. ఇక జగపతి బాబు సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.


సుకుమార్ నాన్నకు ప్రేమతో సినిమాలో కూడా స్టైలిష్ విలన్ గా జగపతి బాబు అలరించారు. ఇక రంగస్థలం లో కూడా రాం చరణ్ కు విలన్ గా చేస్తున్నారు. సినిమాలో జగ్గూ భాయ్ పాత్ర కూడా స్పెషల్ గా ఉంటుందని చెబుతున్నారు. ఇక అనసూయ కూడా చరణ్ కు మేనత్తగా నటిస్తుందట. 


చరణ్, సమంత కాకుండా ఈ మూడు పాత్రలు సినిమాకు చాలా కీలకంగా మారనున్నాయని తెలుస్తుంది. ఇక రంగస్థలం టీజర్ తో సినిమాపై అంచనాలు పెరుగగా.. దేవి శ్రీ అందించిన మ్యూజిక్ తో వచ్చిన సాంగ్స్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ రంగస్థలం ఎలా ఉండబోతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: