మెగా పవర్ స్టార్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా రంగస్థలం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలో చిట్టిబాబుగా చరణ్ చెవిటి వ్యక్తిగా నటిస్తున్నాడు. మార్చి 30న గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ హంగామా మొదలైంది.


ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా రాం చరణ్ కెరియర్ లో ఎన్నడూ లేని విధంగా రికార్డులు నెలకొల్పుతున్న రంగస్థలం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 18 ఉగాది రోజు సాయంత్రం జరుగనుంది. వైజాగ్ వేదికగా జరుగనున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వస్తున్నారని తెలుస్తుంది.


పల్లెటూరి ప్రేమకథగా రాబోతున్న ఈ సినిమాలో చరణ్ చిట్టిబాబుగా మెగా ఫ్యాన్స్ నే కాదు సిని ప్రియులను అలరిస్తాడని అంటున్నారు. రిలీజ్ అయిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేయగా ఇక ఆఫ్టర్ రిలీజ్ హంగామా షురూ అని తెలుస్తుంది. సినిమాలో రాం చరణ్ నటనకు అందరు ఫిదా అవుతారని చెబుతున్నారు చిత్రయూనిట్.


మెగా ఫ్యాన్స్ అందరికి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వివరాలు తెలిసేలా ప్రకటన చేశారు అఖిల భారత చిరంజీవి యువత. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఫ్యాన్స్ కు పిలుపునిచ్చారు. చిరు మాత్రమే కాదు సర్ ప్రైజ్ గెస్టులు కూడా ఉంటారని తెలుస్తుంది. మరి వాళ్లెవరో తెలియాలంటే మాత్రం మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: