బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న యంగ్ హీరో ప్రభాస్ ప్రస్తుతం మరో భారీ సినిమాలో నటిస్తున్నాడు. బాహుబలి 2 సినిమా తర్వాత ప్రభాస్ కి వచ్చిన క్రేజ్ కి ఆయనతో సినిమాలు తీయడానికి ఎంతో మంది దర్శక, నిర్మాతలు క్యూ కట్టారు. కానీ ప్రభాస్ మాత్రం రన్ రాజా రన్ ఫేం సుజిత్ కే చాన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో ‘సాహూ’ సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్.
సాహో సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సీక్వెన్స్లను చిత్రీకరించనున్నారు. నిండా 30 కూడా దాటని సుజీత్ పై నిర్మాత మరియు హీరో ఏ స్థాయిలో నమ్మకాన్ని పెట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
సరైన అవగాహనా ఉంటే గాని ఎవరు ఆ స్థాయిలో సినిమా చేయడానికి దైర్యం చేయలేరు. ఇదిలా ఉంటే..ఈ మద్య సోషల్ మీడియాలో దర్శకుడిపై అలాగే ప్రభాస్ పై కొన్ని రూమర్స్ వచ్చాయి. మేకింగ్ విషయంలో ప్రభాస్ సంతృప్తిగా లేడంటూ సాగుతున్న ప్రచారంపై సుజిత్ స్పందించారు. సోషల్ మీడియాలో ఓ అభిమాని ప్రశ్నకు బదులుగా ‘అలాంటిదేమీ లేదు గురువా! హై కిక్లో వర్క్ చేస్తున్నాం.. మధ్యలో ఇలాంటి న్యూస్ మాకు ఎంటర్టైన్మెంట్ అనుకో’ అంటూ ట్వీట్ చేశారు.
సాహో చిత్రీకరణ చాలా సాఫీగా సాగుతోందని సుజీత్ వివరణ ఇచ్చాడు. దీంతో ఫైనల్ గా ఆ రూమర్స్ కు ఎండ్ కార్డ్ పడింది.ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.