శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కొరటాల శివ, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘భరత్ అనే నేను’. రాజకీయ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా కు సంబంధించిన టీజర్ ఈ మద్య రిలీజ్ అయ్యింది. సామాన్యుడి నుంచి సీఎం గా ఎదిగిన ఓ యువకుడు ప్రజల్లో ఎలాంటి చైతన్యం తీసుకు వస్తున్నాడు అన్న కోణంలో సినిమా రూపొందినట్లు కనిపిస్తుంది. గత రెండు సంవత్సరాలుగా మహేష్ బాబు కి టైమ్ అస్సలు కలిసి రావడం లేదు. బ్రహ్మోత్సవం, స్పైడర్ లాంటి సిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూశాయి.
దర్శకుడు కొరటాల శివ-సూపర్స్టార్ మహేశ్ బాబు కలయికలో రూపొందుతున్న 'భరత్ అనే నేను' చిత్రం పోస్టర్ను ఉగాది పర్వదినం సందర్భంగా చిత్ర యూనిట్ ఈ రోజు విడుదల చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్గా మారింది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఇప్పటికే మొదలుపెట్టేశారు. అందులో భాగంగానే ఈ రోజు ఈ పోస్టర్ను రిలీజ్ చేశారు.
తెల్లని సంప్రదాయ దుస్తుల్లో మహేశ్ చూడచక్కగా ఉన్నాడంటూ ఇప్పటికే పలువురు ఈ పోస్టర్కు తెగ లైక్లు కొడుతూ షేర్ చేసేస్తున్నారు. ఈ సినిమాకు రాక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పాటకు కూడా మరో అద్బుతాన్ని సృష్టించబోతున్నాయట. ఈ సినిమాకి డీవీవీ దానయ్య నిర్మాత. ఏప్రిల్ 20న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.