మెగా పవర్ స్టార్ రాంచరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ‘రంగస్థలం’ ఫ్రీరిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది.  ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రాంచరణ్ దంపతులు, సమంత, ఆది తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ భలే సందడి చేశారు.  అయితే ఎప్పుడూ హాట్ హాట్ గా కనిపించే యాంకర్ అనసూయ మాత్రం చీరకట్టుతో చాలా సింపుల్ గా ఎంట్రీ ఇచ్చింది.  అయితే రంగస్థలం ఫ్రీరిలీజ్ ఫంక్షన్ కి హోస్ట్ గా యాంకర్ సుమ వ్యవహరించారు. 

ఈ సందర్భంగా ‘రంగస్థలం’ సినిమా గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు.  కళాకారుల నృత్యాలు, పాటలతో పాటు పూజా హెగ్డే కూడా హంగామా చేసింది.  ఇక యాంకర్ సుమ అందరిగురించి మాట్లాడుతూ.. అనసూయ గురించి స్పెషల్ గా చెప్పుకొచ్చింది.    అంతే కాదు వేదికపై సుమతో మాట్లాడుతూ, తనను ఇంత త్వరగా వేదికపైకి ఎందుకు పిలిచావని అడిగింది.

వాస్తవానికి ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ తన అభిమాన నటుడని, ఆయనతో తాను అత్తా అని పిలిపించుకోవడం, తాను అల్లుడు అని పిలవడం వంటి పాత్రను చేయలేనని దర్శకుడు సుకుమార్‌తో మొదట చెప్పానని, చివరకు చేశానని నటి, యాంకర్ అనసూయ చెప్పింది. తామందరం కలిసి ప్రేక్షకులను ఈ సినిమా ద్వారా పల్లెటూరు వాతావరణంలోకి తీసుకెళతామని తెలిపింది.

అయితే సుమ మాట్లాడుతూ తనను కూడా ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ కు అక్కగా తీసుకోవాలని ముందుగా అనుకున్నారని, కానీ తనలాంటి నటిని తీసుకుంటే చెల్లిగా తీసుకోవాలి కానీ, అక్కగా తీసుకుంటే బాగుండదని తీసుకోలేదని చమత్కరించింది. అంతే కాదు అనసూయకి శుభాకాంక్షలు చెబుతూ 'రంగమ్మత్త' అంటూ ఆటపట్టించింది. దీంతో అనసూయ 'నేను మా చిట్టిబాబుకి మాత్రమే రంగమ్మత్తని' అని చెప్పింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: