శ్రీవిష్ణు హీరోగా వేణు డైరక్షన్ లో వస్తున్న సినిమా నీది నాది ఒకే కథ. ఈ శుక్రవారం అనగా రేపు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా పబ్లిసిటీ వెరైటీగా చేస్తున్నారు. కేవలం చదువుకున్న వాళ్లే కెరియర్ ను సాఫీగా సాగిస్తారు అన్న ఆలోచనకు మార్చివేసేలా చదువు రాని వారు కూడా ఈ సమాజంలో బాగా బ్రతకొచ్చు అని చూపించే సినిమా ఇది.


ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల మీద చదువు గురించి పెట్టే ప్రెజర్ ను కళ్లకు కట్టినట్టు చూపించారు. సినిమాలో హీరో శ్రీవిష్ణు చదువంటే అసలు ఇష్టం లేని పాత్రలో కనిపించాడు. ఇక రేపు రిలీజ్ అవుతున్న ఈ సినిమా గురించి ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల స్పెషల్ మెసేజ్ చేశాడు. సినిమా చూసిన తను సినిమా ప్రస్థావించిన అంశాలన్ని నేటి సమాజానికి ఉపయోగపడతాయని.


సినిమా తీసిన దర్శకుడు ఇదే మొదటి సినిమా అని తెలిసింది. అతను ఇంత గొప్ప సబ్జెక్ట్ చెప్పగలగడం గొప్ప విషయం అన్నారు. మొత్తానికి శేఖర్ కమ్ముల లాంటి సెన్సిబుల్ ఉన్న డైరక్టర్ మెప్పు పొందిన నీది నాది ఒకే కథ సినిమా చూస్తుంటే మళ్లీ శ్రీవిష్ణు మ్యాజిక్ రిపీట్ చేసేలా ఉంది. 


ఇక ఈ సినిమాతో పోటీగా కళ్యాణ్ రాం ఎం.ఎల్.ఏ, రాజరధం సినిమా వస్తున్నాయి. అందులో ఎం.ఎల్.ఏ సినిమాకు పాజిటివ్ బజ్ ఉంది. నీది నాది ఒకే కథకు యూత్ బాగా ఎట్రాక్ట్ అవుతున్నారు. మరి ఈ మూడు సినిమాల్లో ఏది ఫైనల్ గా సూపర్ హిట్ అవుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: