ఇప్పుడు యంగ్ హీరోల సరసన వరుసగా చాన్స్ లు దక్కించుకొని మంచి ఫామ్ లోకి వచ్చింది బాలీవుడ్ హాట్ బ్యూటీ పూజా హెగ్డే. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వరుణ్ తేజ్ నటించిన ముకుంద సినిమా..అక్కినేని నాగ చైతన్యతో ఒక లైలా కోసం సినిమాల్లో ఎంతో సాంప్రదాయంగా నటించిన పూజా హెగ్డె తర్వాత దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో ఏకంగా బికినిలో నటించి సంచలనం సృష్టించింది.
పూజా సోయగాలు యువత ఆమె జపం చేయడం మొదలు పెట్టారు. ఈ సినిమాతో పూజా హెగ్డే జాతకం ఒక్కసారే మారిపోయింది. ఇప్పుడు పూజ హెగ్డే టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. పూజా హెగ్డేకి ఉన్న క్రేజ్ ని గుర్తించిన దర్శక నిర్మాతలు స్టార్ హీరోల చిత్రాలకు ఆమెని హీరోయిన్ గా ఎంపిక చేసుకుంటున్నారు. పూజా ప్రస్తుతం మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్స్ సరసన నటించే అవకాశాలు అంటుకుంటోంది.
వాస్తవానికి ఒకలైలా కోసం, ముకుందా సినిమాల తర్వాత పూజా హెగ్డేకు తెలుగు లో ఏ చాన్స్ రాలేదు..దాంతో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నించింది. అనుకున్నట్లు గానే స్టార్ హీరో హృతిక్ రోషన్ సరసన మంచి చాన్స్ కొట్టేసింది. ఈ జంట నటించిన మొహంజదారో సినిమా తీవ్రంగా నిరాశపరిచింది.
దీంతో బాలీవుడ్ లో మరో చాన్స్ రాలేదు..ఆ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..మొహంజదారో తనకు పెద్ద గుణపాఠం నేర్పిందని... కష్టపడడమే మన చేతుల్లో ఉందని ఆ చిత్రం ద్వారా తెలిసిందని పూజా తెలిపింది. మంచి అవకాశం వస్తే భవిష్యత్తులో బాలీవుడ్ లో నటిస్తానని తెలిపింది.