యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందని తెలిసిందే. ఏప్రిల్ 12 నుండి సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమాలో తారక్ కొత్త లుక్ తో కనిపిస్తాడని అంటున్నారు. అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రం కచ్చితంగా హిట్ కొట్టాల్సిన సినిమా ఇది. అంతేకాదు ఎన్.టి.ఆర్ హిట్ మేనియా కంటిన్యూ చేసేలా ఈ సినిమా ఉండాలని చూస్తున్నారు.


హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో హాట్ బ్యూటీ పూజా హెగ్దె మెయిన్ లీడ్ గా ఓకే అవగా సాహో భామ శ్రద్ధ కపూర్ కూడా సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. తమన్ మ్యూజిక్ తో రాబోతున్న ఈ సినిమా కోసం ఓ భారీ సెట్ వేస్తున్నారట. 


సినిమా ఎక్కువ భాగం ఈ సెట్ లోనే షూట్ చేస్తారని తెలుస్తుంది. అంతేకాదు సినిమా మొత్తం కేవలం సింగిల్ షెడ్యూల్ లోనే పూర్తి చేయాలని చూస్తున్నారట. ఎన్.టి.ఆర్ లాంటి పెద్ద హీరో సినిమా అది కూడా సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయడం అంటే చిన్న విషయం కాదు. అయితే రాజమౌళి సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేశాడు కాబట్టి అనుకున్న టైం లో త్రివిక్రం సినిమా కంపల్సరీ పూర్తి చేయాలని చూస్తున్నాడు ఎన్.టి.ఆర్.


అందుకే అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర ఓ సెట్ కూడా వేశారట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాగా సింగిల్ షెడ్యూల్ లో నిరంతరాయంగా సినిమా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారట. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ ఇదవరకు ఎన్నడూ చూడని విధంగా ఉంటాడట. స్టార్ సినిమా సింగిల్ షెడ్యూల్ అంటే మళ్లీ త్రివిక్రం రిస్క్ చేస్తున్నాడనే అంటున్నారు. మరి దీని ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: