టాలీవుడ్ ఇండస్ట్రీలో డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు పూరీ జగన్నాథ్. ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, దర్శకుల వారసులు ఎంట్రీ ఇస్తున్న తరుణంలో.. ప్రస్తుతం తన ఫోకస్ అంతా తన కుమారుడు ఆకాష్ పూరిని ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టడంపైనే పెట్టారు. ఆకాష్ హీరోగా సొంత బేనర్లో 'మెహబూబా' చిత్రాన్ని రూపొందిస్తున్న ఆయన.... విడుదల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు.
దిల్ రాజు ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ విషయమై చిత్రబృందం ఓ ప్రెస్నోట్ను రిలీజ్ చేసింది. ‘‘సక్సెస్ఫుల్, బాగా పేరున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు గారి వెంకటేశ్వర ఫిలిమ్స్తో అసోసియేట్ అవడం చాలా ఆనందంగా ఉంది. మెహబూబా మూవీ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో పూరి ఆకాష్ హీరోగా పూరి కనెక్ట్స్ వెంచర్పై రూపొందించబడింది.
వెంకటేశ్వర ఫిలిమ్స్తో అసోసియేట్ అయ్యాక ఇడియట్, పోకిరి వంటి బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్ను అందించడం జరిగింది. అనంతరం ఈ మాకు స్పెషల్ ఫిలిం అయిన ఈ సినిమా ద్వారా సూపర్ సక్సెస్ఫుల్ అసోసియేషన్ను రిపీట్ చేయడం ఆనందంగా ఉంది. మా మెహబూబా ఫిలిం వేసవిలో మే 11, 2018న రిలీజ్ చేస్తున్నాం’’ అంటూ పూరి కనెక్ట్స్ కో ఫౌండర్ ఛార్మి ప్రెస్ నోట్ను రిలీజ్ చేసింది.
ఇటీవలకాలంలో ‘టెంపర్’ తర్వాత పూరీ తెరకెక్కించిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ కావడంతో ‘మెహబూబా’ని కొనుగోలు చేసేందుకు బయ్యర్లు ముందుకు రాలేదని ప్రచారం సాగింది. ఈ క్రమంలోనే పూరిజగన్నాథ్ అలర్టయి దిల్రాజుతో టచ్ లోకి వచ్చాడు. ఇద్దరు మధ్య చర్చలు కొలిక్కిరావడంతో రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయ్యింది.
ఈ మేరకు ‘పూరీ కనెక్ట్స్' చిత్ర నిర్మాణ సంస్థ నుండి అఫీషియల్ ప్రకటన వెలువడింది. ఈ సినిమా కోసం దిల్రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్తో చేతులు కలిపినట్లు అందులో పేర్కొన్నారు. గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇడియట్', ‘పోకిరి' చిత్రాలతో దిల్ రాజు అసోసియేట్ అయ్యారు. చాలా కాలం తర్వాత వీరి అసోసియేషన్లో ‘మెహబూబా' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.