దివంగత నేత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మహి వి రాఘవ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డిగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నాడని తెలిసిందే.


ఈ సినిమా బడ్జెట్ కూడా 30 కోట్లతో తెరకెక్కిస్తారని తెలుస్తుంది. సినిమా కమర్షియల్ గానే ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో జగన్ మోహన్ రెడ్డిగా ఎవరు నటిస్తారన్నది తెలియాల్సి ఉంది. అయితే జగన్ భార్య భారతిగా మాత్రం టాలీవుడ్ క్రేజీ బ్యూటీ కీర్తి సురేష్ నటిస్తుందని తెలుస్తుంది. మళయాళ  పరిశ్రమ నుండి వచ్చిన కీర్తి సురేష్ అతి తక్కువ టైంలోనే టాలీవుడ్ క్రేజీ బ్యూటీగా మారింది. 


బయోపిక్ ను కేవలం ఓ డాక్యుమెంటరీగా కాకుండా సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్ గా వై.ఎస్ గొప్పతనం అందరికి తెలియచేసేలా సినిమా ఉంటుందట. ఇక ఈ సినిమా గురించి మిగతా కాస్ట్ అండ్ క్రూ డీటైల్స్ త్వరలో తెలియాల్సి ఉంది. లాస్ట్ ఇయర్ ఆనందో బ్రహ్మ సినిమా నిర్మించిన విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  


మహానేత వై.ఎస్ గురించి అందరికి తెలిసిన విషయాలతో పాటుగా పాదయాత్ర టైం లో జరిగిన విషయాలను కూడా ఇందులో ప్రస్థావించడం జరుగుతుందట. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. సినిమా బడ్జెట్ లెక్కలు చూస్తే కచ్చితంగా ఇది పెద్ద రేంజ్ లోనే తీస్తున్నారట.   



మరింత సమాచారం తెలుసుకోండి: