టాలీవుడ్ లో ఇప్పుడు మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే ఈ రూట్ కి రాజమౌళి గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. అదే దారిలో ట్రావెల్ చేయబోతున్నాడు హరీష్ శంకర్. ప్రజెంట్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని నితిన్ -శర్వానంద్ తో తెరకెక్కించబోతున్నాడు. ఇంతవరకు ఓకే.. కానీ సడన్ గా హరీష్ కి ఈ యంగ్ హీరోస్ కనెక్ట్ అవ్వడానికి కారణమేంటి..?

Image result for harish shankar

లాస్ట్ ఇయర్ బన్నీతో దువ్వాడ జగన్నాధం తీసి కాస్త డల్ అయిన డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ సినిమా రిజల్ట్ గాడి తప్పడంతో కాస్త గ్యాప్ తీసుకున్న హరీష్ ఇప్పుడు తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెంచాడు. దిల్ రాజు బ్యానర్ లో ఓ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్  రెడీ అవ్వడం.... మల్టీ స్టారర్ కాన్సెప్ట్ కావడంతో హీరోలను సెట్ చేసుకోనే పనిలో బిజి అయ్యాడు ఈ డైరెక్టర్. ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ కి నితిన్, శర్వానంద్ లు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జూన్ నుంచి ఈ సినిమా పట్టాలెక్కనుంది.

Image result for nitin and sharwanand

హరీష్ తెరకెక్కించే మల్టీస్టారర్ కి దాగుడుమూతలు అనే టైటిల్ డిసైడ్ చేసినట్టు టాక్ వినిపిస్తుంది. ఇక స్టోరీ విషయానికి వస్తే రెండు జంటల మధ్య జరిగే ఫుల్ ఎంటర్ టైనర్ మూవీగా తెలుస్తోంది. అసలే మల్టీ స్టారర్ ట్రెండ్ టాలీవుడ్ లో మహా జోరుగా సాగుతోంది. ఎన్నడూ లేని రీతిలో ఈ సంవత్సరం క్రేజీ కాంబోలు తెరకెక్కుతున్నాయి. చరణ్-తారక్ తో రాజమౌళి డ్రీం వెంచర్, వెంకీ - వరుణ్ తేజ్ చేస్తున్న ఎఫ్2, నాగార్జున-నానితో శ్రీరామ్ ఆదిత్య మూవీ ఇప్పుడు ఈ సిరీస్ లో దాగుడుమూతలు కూడా జాయిన్ కాబోతోంది. ప్రజంట్ నితిన్ 'శ్రీనివాస కళ్యాణం' షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. శర్వానంద్ హను రాఘవపూడి తీస్తున్న 'పడి పడి లేచే మనసు'లో ఎంగేజ్ అయ్యాడు. ఈ రెండు పూర్తయ్యాకే దాగుడుమూతలు సెట్స్ పైకి వెళ్తుంది.

Image result for rakul with nivedaImage result for rakul with niveda

ప్రజంట్ టాలీవుడ్ లో నితిన్, శర్వానంద్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. కాబట్టి ఈ కాంబినేషన్ ఖచ్చితంగా హిట్ మెట్టెక్కే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా రకుల్ ప్రీత్ సింగ్ - నివేదా థామస్ ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది. మొత్తానికి ఈ సినిమా షూటింగ్ ని జూన్ లో స్టార్ట్ చేసి డిసెంబర్ లో  విడుదల చేయలనే ప్లాన్ లో ఉన్నాడు హరీష్.


మరింత సమాచారం తెలుసుకోండి: