గత కొన్ని రోజులుగా మీడియాలోనూ, సామజిక మాధ్యమాల్లోనూ నటి శ్రీరెడ్డి సంచలనంగా మారింది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, అంతే ఘాటుగా సంచలనమైన లీకులు ఇస్తూ హల్ చల్ సృష్టిస్తోంది. శ్రీరెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. తనకు టాలీవుడ్ లో ప్రముఖులు అన్యాయం చేసారని శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ లో జరుగుతున్న దారుణాలపై శ్రీరెడ్డి బహిరంగంగానే మాట్లాడుతోంది. తాజగా శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కోరుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి.


          సోషల్ మీడియా ద్వారా ఇటీవలే ఆమె సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవాలని కోరింది. ఇండస్ట్రీలో తనలాంటి వాళ్లకు న్యాయం చేయాలని కోరింది. 'కేసీఆర్ గారూ, మీరు మా బాధను అర్థం చేసుకోకపోతే... నిరాహారదీక్ష చేస్తా. గతంలో మీరు పోరాడి, విజయం సాధించిన మార్గాన్నే నేను ఎంచుకున్నా. మీరు ఇప్పటికీ స్పందించకపోతే, పబ్లిక్ లో నగ్నంగా నిలబడి నిరసన తెలుపుతా. దయచేసి మేల్కోండి సార్. మిమ్మల్ని ఎలా కలవాలో కూడా నాకు తెలియడం లేదు' అని ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా తెలిపింది.

Image result for sri reddy

          అన్నట్టుగానే ఇవాళ ఫిల్మ్ ఛాంబర్ ముందు శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శనకు దిగింది. తెలుగు సినిమాల్లో 75 శాతం అవకాశాలను తెలుగు అమ్మాయిలకే ఇవ్వాలని డిమాండ్ చేసింది. మాలో సభ్యత్వం ఇవ్వాలని డిమాండ్ చేసింది. తన ప్రశ్నలకు ఇండస్ట్రీ పెద్దలు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేసింది. శ్రీరెడ్డి ఒక్కసారిగా టాప్ లెస్ గా కూర్చొని ధర్నాకు దిగడంతో ఇండస్ట్రీ పెద్దలతో పాటు అక్కడున్నవాళ్లంతా ఆశ్చర్యపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: