పూరి జగన్నాథ్ డైరక్షన్ లో పూరి తనయుడు ఆకాష్ హీరోగా నటిస్తున్న సినిమా మెహబూబా. 1971 కాలం నాటి బోర్డర్ లో జరిగిన ప్రేమకథగా ఈ సినిమా వస్తుంది. ఓ పక్క ఇండో పాక్ యుద్ధం మరో పక్క మెహబూబాతో హీరో ప్రేమ ఇలా ఓ మంచి స్టఫ్ ఉన్న కథతో వస్తున్న పూరి ఈ సినిమా ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ చేశాడు. 


సినిమా ట్రైలర్ చూస్తే కచ్చితంగా పూరి ఈ సినిమా కోసం కొత్తగా ట్రై చేశాడని అనిపిస్తుంది. ఇన్నాళ్లు రొటీన్ సినిమాలతో ఫ్లాపులను చవిచూస్తున్న పూరి మంచి కథతో వస్తున్నట్టు తెలుస్తుంది. ట్రైలర్ లో యుద్ధానికి సంబందించిన సన్నివేశాలే ఎక్కువగా కనిపించాయి. అయితే హీరో హీరోయిన్ కూడా క్యూట్ గా ఉన్నారు.    


నో వన్ లవ్స్ సోల్జర్ అంటిల్ ఎనిమీ ఈజ్ ఎట్ ద గేట్ అనే డైలాగ్ ఆకట్టుకోగా.. చివర్లో సల్మాన్ ఖాన్ జిందాబాద్, షారుఖ్ ఖాన్ జిందాబాద్, అమీర్ ఖాన్ జిందాబాద్, అబ్దుల్ కలాం జిందాబాద్, మొహబ్బత్ జిందాబాద్, మేరీ మెహబూబా జిందాబాద్ అన్న డైలాగ్ సినిమాలోని ఇంటెన్సిటీని తెలియచేస్తుంది.


పూరి ఎంతో కసితో చేసిన సినిమాగా మెహబూబా వస్తుందని చెప్పొచ్చు. పూరి తన స్వీయ నిర్మాణంలో ఈ సినిమా వస్తుంది. మే 11న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు. దిల్ రాజు ఈ సినిమాను వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తుండటం విశేషం. ఆకాష్ తో పాటుగా నేహా శెట్టి ఫీమేల్ లీడ్ గా నటించింది. సందీప్ చౌత మ్యూజిక్ అందించిన ఈ సినిమా ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: