బాహుబలి ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సాహో. ఫాంటసీ లాగా కనిపించబోతున్న ఈ మూవీకోసం ప్రభాస్ తీవ్రంగా కష్టపడుతున్నాడు. బాహుబలి తర్వాత వస్తున్న మూవీ కావడంతో అంచనాలు పెరిగిపోయాయ్. అందుకే ఏమాత్రం తేడా రాకుండా చూసుకోవడానికి ప్రభాస్ రిచ్ గా ప్లాన్ చేస్తున్నాడు.       

Image result for sahoo images

టాలీవుడ్ లో సాహో మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ మూవీ హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతోందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయ్. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాను ఓ రేంజ్ లో నిర్మించేందుకు నిర్మాతలు ప్లాన్ చేశారు. ఖర్చుకు వెనకాడకుండా భారీ సెట్టింగులతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కేవలం 20 నిమిషాల ఛేజింగ్ సీన్లకోసం 40 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు సినిమా టీం సిద్ధమైందంటే ఏ రేంజ్ లో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. అది కూడా అబుదాబిలో..! 

Image result for sahoo images

అబుదాబిలో సెట్టింగులను బాహుబలిని మించిన రీతిలో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఆ సినిమాకు పని చేసిన సాబు సిరిల్ టీమే ఇందుకు కూడా వర్క్ చేస్తుండడం విశేషం. ఆరు నెలల క్రితమే అబుదాబి వెళ్లి అన్నీ సెట్ చేసుకుని వచ్చిన సాబు సిరిల్, నెల రోజులుగా అక్కడే మకాం వేసి సెట్టింగులను స్పీడప్ చేసినట్టు తెలుస్తోంది. ఇందుకోసం వందల మంది వర్కర్లతో పాటు సామాగ్రి భారీగా తరలించినట్టు సమాచారం. ఇవన్నీ చూస్తుంటే సాహో మూవీ.. హాలీవుడ్ రేంజ్ కి ఏమాత్రం తగ్గేలా లేదు..

Image result for sahoo images

హాలీవుడ్ యాక్షన్ మాస్టర్ కెన్నీ బీట్స్ సాహోలో యాక్షన్ పార్ట్ ను డైరెక్షన్ చేస్తున్నాడు. హాలీవుడ్ సినిమాల్లో లాగా భారీగా ఈ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. సినిమాకు ఈ పార్టే హైలైట్ గా ఉంటుందని టాలీవుడ్ టాక్. మరి చూద్దాం ఏ రేంజ్ లో ఉండబోతోందో.


మరింత సమాచారం తెలుసుకోండి: